దక్షిణ దేశ యాత్ర 3 | Dakshina Desa Yathra 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 11, 2023 · 12 MIN

దక్షిణ దేశ యాత్ర 3 | Dakshina Desa Yathra 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దక్షిణ దేశ యాత్ర మూడవ భాగం రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఫళని: ఈ క్షేత్రం దిండిగల్‌ జిల్లా లోని మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరు స్వామి క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామి వారిని దండాయుదపాణి అనే నామంతో పిలుస్తారు. ఈయనను ఫళనిమురుగా యని కూడా పిలుస్తారు. జ్ఞానఫలాన్ని ఇచ్చే వాడు కనుక ఫళనిస్వామి అయ్యాడు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి ఒక చేతిలో దండం పట్టుకుని, కౌపీనధారియై, వ్యుప్తకేశుడై నిలబడి, చిరునవ్వు లొలికిస్తూ ఉంటారు. దానికి అర్థం "నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో"- అని మనకి సందేశం ఇస్తున్నారు. అంటే ఫళని క్షేత్రం జ్ఞానము ను ఇచ్చే క్షేత్రము. స్వామి వారు కొండ పైన ఉన్నారు. చేరుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి కాలినడకన మెట్లు ఎక్కడం. రెండు- రోప్‌వే మీద రైలు. --------------- సుఛీంద్రము: నేరాన్ని ఋజువు చేసే శుచీంద్ర శివుడు. కన్యాకుమారి కి కేవలం 13 కి. మీ. ల దూరంలో ఈ ఆలయం కలదు. స్వయంభూ వెలసిన లింగ స్వరూపుడు. లింగం అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు. శుచీద్రం దత్తాత్రేయ క్షేత్రం గా ప్రసిద్ది చెందినది. శంకర భగవత్పాదులు పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ చూశారట. పరమ శివులు ఆదిశంకరుల వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన స్థలం. దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే ' శుచీద్రం' అని పేరొచ్చింది. రామేశ్వరము: ఈ దేవాలయం ద్వీపము లో కలదు. భారతదేశం లోని ఆలయాలన్నింటి కంటే విశాలమైన ఆవరణ కలిగియుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. 12 వ శతాబ్ది లో విస్తరించబడింది. ఈ పట్టణం ప్రదాన భూబాగం నుండి పంబన్‌ కాలువ ద్వారా వేరుచేయబడింది. శ్రీరాముడు నిర్మంచిన సేతువు ఇక్కడ ఉంది. లంకకు సముద్రమార్గము ఇదే. రావణాసురుని నిహతుని చేశాక రామనాథేశ్వర లింగం ఇక్కడ శ్రీరాములవారు ప్రతిష్టించారు. ఈ ప్రదేశము ప్రఖ్యాత తీర్థస్థలి యే కాకుండా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం. కాశీ కి వెళ్ళిన వారు అక్కడి గంగను తీసుకు వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారు. మళ్ళీ ఇక్కడి ఇసుకను తీసుకు వెళ్ళి అక్కడ గంగ లో కలుపుతారు. ఇక్కడ శివ లింగం సైకతం. ' ఇక్కడ సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, చిన్నచిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపుబళ్ళు, నీలిరంగులో మైమరపించే సముద్రము.. ఎన్నాళ్ళు చూసినా తనివితీరని తీరదు. చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కోటితీర్థాలు, రామపాదాలు, దనుష్కోటి, విభీషణాలయం మొదలగునవి చాలా ఉన్నాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ZrR329JjO0U

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దక్షిణ దేశ యాత్ర మూడవ భాగం రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఫళని: ఈ క్షేత్రం దిండిగల్‌ జిల్లా లోని మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరు స్వామి క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామి వారిని దండాయుదపాణి అనే నామంతో పిలుస్తారు. ఈయనను ఫళనిమురుగా యని కూడా పిలుస్తారు. జ్ఞానఫలాన్ని ఇచ్చే వాడు కనుక ఫళనిస్వామి అయ్యాడు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి ఒక చేతిలో దండం పట్టుకుని, కౌపీనధారియై, వ్యుప్తకేశుడై నిలబడి, చిరునవ్వు లొలికిస్తూ ఉంటారు. దానికి అర్థం "నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో"- అని మనకి సందేశం ఇస్తున్నారు. అంటే ఫళని క్షేత్రం జ్ఞానము ను ఇచ్చే క్షేత్రము. స్వామి వారు కొండ పైన ఉన్నారు. చేరుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి కాలినడకన మెట్లు ఎక్కడం. రెండు- రోప్‌వే మీద రైలు. --------------- సుఛీంద్రము: నేరాన్ని ఋజువు చేసే శుచీంద్ర శివుడు. కన్యాకుమారి కి కేవలం 13 కి. మీ. ల దూరంలో ఈ ఆలయం కలదు. స్వయంభూ వెలసిన లింగ స్వరూపుడు. లింగం అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు. శుచీద్రం దత్తాత్రేయ క్షేత్రం గా ప్రసిద్ది చెందినది. శంకర భగవత్పాదులు పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ చూశారట. పరమ శివులు ఆదిశంకరుల వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన స్థలం. దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే ' శుచీద్రం' అని పేరొచ్చింది. రామేశ్వరము: ఈ దేవాలయం ద్వీపము లో కలదు. భారతదేశం లోని ఆలయాలన్నింటి కంటే విశాలమైన ఆవరణ కలిగియుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. 12 వ శతాబ్ది లో విస్తరించబడింది. ఈ పట్టణం ప్రదాన భూబాగం నుండి పంబన్‌ కాలువ ద్వారా వేరుచేయబడింది. శ్రీరాముడు నిర్మంచిన సేతువు ఇక్కడ ఉంది. లంకకు సముద్రమార్గము ఇదే. రావణాసురుని నిహతుని చేశాక రామనాథేశ్వర లింగం ఇక్కడ శ్రీరాములవారు ప్రతిష్టించారు. ఈ ప్రదేశము ప్రఖ్యాత తీర్థస్థలి యే కాకుండా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం. కాశీ కి వెళ్ళిన వారు అక్కడి గంగను తీసుకు వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారు. మళ్ళీ ఇక్కడి ఇసుకను తీసుకు వెళ్ళి అక్కడ గంగ లో కలుపుతారు. ఇక్కడ శివ లింగం సైకతం. ' ఇక్కడ సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, చిన్నచిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపుబళ్ళు, నీలిరంగులో మైమరపించే సముద్రము.. ఎన్నాళ్ళు చూసినా తనివితీరని తీరదు. చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కోటితీర్థాలు, రామపాదాలు, దనుష్కోటి, విభీషణాలయం మొదలగునవి చాలా ఉన్నాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ZrR329JjO0U

NOW PLAYING

దక్షిణ దేశ యాత్ర 3 | Dakshina Desa Yathra 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 12:35

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 11, 2023.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దక్షిణ దేశ యాత్ర మూడవ భాగం రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఫళని: ఈ క్షేత్రం దిండిగల్‌ జిల్లా లోని మధురై నుంచి 120...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!