'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ episode artwork

EPISODE · May 4, 2021 · 20 MIN

'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ

from Harshaneeyam

హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది.కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరిబాబు గారికి కృతజ్ఞతలు.హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)మంత్రపుష్పం :పాపం! - చిట్టి రాలిపోయిందిరా!" అన్నాడు, మొనమొన్ననే జిల్లా కాంగ్రెసు సంఘంలో కృత్యాద్యవస్థమీద సభ్యుడుగా జొరబడ్డ మా పంతులు."ఎప్పుడు?" అని మేం నలుగురం అడిగాము, గొంతులు బిగిసి. “వారం రోజులయింది!" అని జవాబు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు!"బ్రతికి ఎందర్నో సుఖ పెట్టింది! పోయి తాను సుఖపడుతుంది" అంటూ మాలో ఒకడి నిట్టూర్పు!"ఆ బ్రతుక్కి చచ్చిపోవడంకన్న సుఖమేముంది? తెరిపి ఏముంది?- అదృష్టవంతురాలు!" అని మరొకడి సాకారం.“అవును, దాని బ్రతుకంతా చచ్చినచావే! అది కాగా నెట్టుకొచ్చింది కాని, మరో ఆడదైతే-"“మరో ఆడదానికి అంత దమ్ముంటుందా?- గట్టిగా చెడిపోయేందుకన్నా నిష్ఠంటూ ఒకటి ఉండాలి!"చిట్టి బ్రతికి ఉన్నప్పుడు, ఎవరన్నా ఇలా నోరెత్తగలిగారా? - ఎవడికి గుండెలున్నాయ్-ఎవరెల్లా మాట్లాడినా, మొత్తానికి అందరమూ చిట్టి స్వర్గానికి చేరుకున్నందుకు - సాదా స్వర్గం కాదు, పచ్చి వీరస్వర్గం - ఎంతో వాపోయినాము. మా విచారం చిట్టి పోయిందని కాదు. సరిగ్గా ఆ వేళకే - ఎప్పుడూ ఊళ్ళోనే ఉట్టి కట్టుకుని ఊరేగే బడుద్దాయిలం యావన్మందీ - ఏదో మునిగిపోయినట్లు - ఎవరమూ ఊళ్ళో లేకుండా పోయినందుకు, ఆ వైభవం కళ్ళారా చూసే భాగ్యం లేకపోయినందుకు..చిట్టి భౌతిక శరీర లేశానికి వీరాధి వీరోచిత మర్యాదలు జరిగినవి. త్రివర్ణ పతాకాన్ని కప్పి, కాంగ్రెసు వాలంటీర్లు, రెండోరకం నాయకులూ జయజయ నినాదాలతో బారులు తీరి ముందు నడవగా, చిట్టి పితృవనానికి పయనించింది. మంచిగంధపు ధూళిలో మలిగిపోయింది.ఈ మర్యాదలో మర్మం - మా ఊరి వారికి - అందులోనూ ఇంగితమున్న కొందరికి - కాని అర్థంకాదు. విన్నవాళ్ళూ - పత్రికలో చదివిన వాళ్ళూ - "ఇదేం విడ్డూరం? ఈ ఊళో కాంగ్రెసువారు కేమన్నా పిచ్చి ఎక్కిందా? లేకపోతే, పెద్దలను వెక్కిరించడానికా, ఈ తతంగమంతా. లేకపోతే.. సామాన్యపు బజారీ పడుపుగత్తె కనుమూస్తే బ్రహ్మరథం పడతారా? " అనుకుంటూ విసుపోవచును అందులో అబ్బురం ఏమీలేదు. చిట్టి బ్రతుకు మా సీమదాటి ఎందరికి తెలుసు? - ఆ మనిషి మనసు ఎవరికి తెలుసును .పోనీ - ఇప్పుడన్నా, లోకం కనువిప్పడం మేలు.చిట్టి - ఏ తల్లి కడుపునో పుట్టింది. ఏ చెట్టునీడనో తినో మానో ఎలాగో పెరిగింది. పదేళ్లు వయసులో బొద్దుగా గున్నలాగా ఉండేది. సినీమాకు, ఆడవాళ్ళ గేటు దగ్గిర సమ్మరం చూచుకుని దూసుకుపోయేది. సినీమాలో విన్న పాటలూ - చూసిన ఆటలూ - కునికిపాట్లు పడుతూండే జట్కాబండి వాళ్ళ దగ్గిరపాడేది - ఆడేది. వాళ్ళు విసిరేసిన కానీ డబ్బులు పరికిణీ రొండిన దోపుకునేది. ఎవడి చెవిసందునుంచో ఓ బీడీ ఎగేసుకుపోయి, కమ్మగా దమ్ముకొట్టి ఎక్కడ నిద్రవస్తే అక్కడే పడుకునేది. చెట్టుమీద వాలే గువ్వపిల్లంత గోముగా, ఈ చెట్టుకింద పక్షి పెరిగింది.చిట్టికి ఎవరా పేరు ఎప్పుడు పెట్టారో, ఎవరా పేరుతో మునుముందుగా పిలిచారో తెలిసే దాఖలా ఏమీలేదు. కాని, ఓ రకంగా ఊహించడానికి కొంతవరకు వీలున్నది. అసహాయోద్యమ యోధులలో కొన్ని వర్గాలు కేవలం శాంతి సమరంమీద విసుగుపుట్టి - రైలు పట్టాలు లేవనెత్తడం, తంతితీగెలు తెంచడం ఇత్యాది సర్కస్ ప్రదర్శనానికి నడుంకట్టి దుమికిన రోజుల్లో - మా వూళ్ళో, ఉత్తరాదినుంచి వచ్చిన గారడివాడి ఆటలో, తొలుదొల్తగా  చిట్టి సాక్షాత్కరించింది. వాడు, ఏదో లాగవం చేయడానికి - ఎవరన్నా ఓ కూన అవసరమై,  చుట్టూ మూగిన మూకలో ఏ పోరగాణ్ణి రమ్మన్నా రాకపోవడంతో - "పోనీ నీవు రా చిట్టి, నిన్నేం కొరుక్కు తిననులే!" అని, జనం మధ్య కుమ్మిసలాడుకుంటూ ఆట చూడటానికి ముందుకు నెట్టుకువస్తున్న ఈ ఏబ్రాసిని, వాడు వెక్కిరింతగా పిలవడంతో, చిట్టి ఆ సుముహూర్తాన రంగంలోకి నిర్భయంగా దూకి - వాడితోబాటు ఆడి, వాడిని ఆడించి ఆ పూటనుంచీ - చిట్టి మాదైపోయింది. అదే పేరైపోయింది.చిట్టి ఎవరు పిలిచినా పలికేది. అందరినీ కవ్వించి మాట్లాడేది. దాని మాటలో అదో పొంకం ఉంది. మాటకు మాటకూ మధ్య మౌనంగా పెదవి విరుపులో - ఆ కంటి చూపులో - ఏదో చెప్పరానంత నిండు ఉంది. చిట్టి అలవోకగా బూతులు మాట్లాడేస్తున్నా, ఎంత శోత్రియుడికైనా వినడానికి ఏమీ ఎబ్బెట్టు ఉండేది కాదు.చిట్టి అధిక చక్కంది. అదంతా అర్థంకాని అందం. ఎండా వానా అనకుండా, అహర్నిశలూ ఆగమ్మ కాకిలాగా తిరుగుతూ, అందిందల్లా తింటూ, ఏ జన్మానా, జుట్టుకు చమురూ, ఒంటికి నలుగూ లేని ఏబ్రాసి - లక్సు పరిమళ సబ్బుతో చర్మ సౌందర్యాన్ని రక్షించుకునే తారల గ్లేజు  బొమ్మలకన్న పోణెం  గా ఉండేది. పిల్లదాని పోషణ యావత్తు పంచప్రాణభూతాలు చేసేవి,  అని మా కందరికీ గట్టి నమ్మకం! వచ్చిన ఏడాది లోపలే చిట్టికి నిండుగా వయసు వచ్చేసింది. వచ్చిన మరుక్షణంలోనే - ఎవరో , పొరుగూరు నుంచి బడి చదువుకోసం వచ్చిన ఓ కుర్రవాడి చెంప - నడి బజారులో నాలుగు రోడ్లు కలిపే రద్దీలో మెరుపు దీపం క్రింద చెళ్ళుమంది. అది ఎలా జరిగిందంటే -చిట్టి అప్పటి నుంచి, కొన్ని రోజులుగా, సంజపడిన తరువాత సరిగా అదే వేళకు, ఆ దీపం దగ్గరకు వచ్చి, ప్రొద్దుపోయేదాకా ఉండి కడుపు పట్టినంత, ముంత క్రింద పప్పు కొనుక్కు తినేది. అంటే, తిన్నదంతా కొనుక్కునేది అనకూడదు. కొన్నప్పుడల్లా కొన్నంత కొసరేయించుకునేది. చనువైనవాడు కొంటూంటే కలియబడి ఓ పట్టెడు కముచుకునేది - బేరం సాగినంత సేపూ ఇలాగే బొక్కుతూ, చివరకువాడు జంగిడి ఎత్తేవేళకు - మిగిలిన అడుగూ బొడుగూ దులిపించుకుని - కారం చేయి, పక్కనున్న స్తంభానికి వేసి పామి - ఓ గుక్కెడు నీళ్ళు తాగి, చక్కా బోయేది.అవాళా అలాగే పోతూంటే - అందుకోసమే కాపేసుకుని ఉన్న కుర్రవాడు చాలా దూరం వెన్నంటి వెళ్ళి - అడుగు కలిపి అడుగువేసి - పలుకరించబోయినట్లు గొంతు తడబడి అందుబాటులో ఉన్న చెయ్యి పుచ్చుకున్నాడు. చిట్టి నదురూ బెదురూ లేకుండా - తెరిపిగా ఉన్న చేత్తో, వాడి చెంప మోగించింది. దెబ్బతో, వాడు పాపం గింగిరాలెత్తిపోయి - ఓ పొల్లుకేక పెట్టి, రోడ్డు పుచ్చుకున్నాడు.రాత్రి ఇలా జరిగిందని చిట్టి, తెల్లవారగానే ఎవరితోనో చెప్పింది. నిమిషంలో ఆ కథ ఊరు మొత్తంమీద గుప్ మన్నది. చిట్టికి వయసు వచ్చిందని అందరికీ అర్ధం అయింది.ఊరు యావత్తూ విస్తుపోయిందంటే అబ్బురం ఏమీలేదు. అన్నాళ్ళనుంచీ చిట్టి, అలా వాళ్ళ నడుమను పెరుగుతున్నా. అంత ఏపుగా కనబడుతూన్నా - చిట్టి వయసు వచ్చిన పిల్లది అనే భావనగాని - దాన్ని చూసి మరులెత్తించుకోవాలనిగాని - ఎందుచేతనో జనాభాలో ఏ ఒక్కడికీ తోచినట్టులేదు.ఆ క్షణాన్నుంచి ఎవడికివాడే చిట్టిని చూస్తే బెదిరిపోవడం మొదలు పెట్టాడు. చిట్టి మాత్రం ఏమీ మారిపోలేదు. చుట్టూ మెలిగే లోకం మాత్రం విచ్చిపోయింది.బెదురు ఎందుకంటే ఆ చిన్నది చేయి చేసుకుంటుందని కాదు. అది భయం కూడా కాదేమో - ఎవరి మానాన వాడు తానంత యంబ్రహ్మ నేమో అని కించపడి ఉంటాడు. ఇంకోఫికరు కూడా ప్రతివాడికి ఉండి ఉంటుంది. చిట్టి ఎంతమాత్రమూ చాటూ మాటూ లేనిపిల్ల. ఇదివరకైతే ఆ చొరవ అందరికీ సరదా. ఇప్పుడు, మునుపటి ధోరణిలోనే పలుకరిస్తే - చిట్టి ఏమనుకున్నా అనుకోకపోయినా, చూసే మరో మగరాయడు అసూయతో అయినా, అపార్థం చేసుకుంటాడు.చిట్టి కనబడ్డ ప్రతి మనిషితోనూ, రాత్రి జరిగిన ముచ్చట చిలవలు పలవలు లేకుండా చెప్పింది. ఎంత పనిమీద పోయే పెద్దమనిషినైనా, నిలవేసి చెప్పింది. కోర్టుకు వేళ మించిందని ఉరుకులు పరుగులుగా జట్కా ఉరికించే లాయర్లను నిలవేసి చెప్పింది. తప్పించుకుపోయేవాళ్ళని తరుముకు వెళ్ళి, చేయి పట్టుకుని జబర్దస్తీగా ఆపి చెప్పింది. ఓపికున్నంతవరకూ, ఒక్కొక్కడికే చెప్పి... ఎంతసేపటికీ తెమలక పోతే చిరాకుపడి పీచుమిఠాయి అమ్మే సాయెబ్ చేతిలో బాకా లాక్కుని, నాలుగు దిక్కులూ దద్దరిల్లేట్లు చెప్పింది.జరిగిందేదో చెప్పిందే కాని, అవతల కుర్రవాణ్ణి తుట్టలేదు - తిమ్మలేదు. జాలిగా, విసుగ్గా, కసురుకుంటూన్నట్టు తనలో తాను గొంతెత్తి అనుకుంది. “వాడేం మొగాడు!- చెయ్యట్టుకున్నాడు!"ఆ కథ అంతటితో పోలేదు. ఆ కుర్రవాడెవరో మాకెవరికీ ఈనాటికీ తెలియదు. చిట్టికీ తెలియదు. కాని అహోరాత్రాలు అదే చూపుగా తిరిగి, ఎక్కడో మొత్తానికి పట్టుకుంది. పట్టుకుని, వాడు కోరుకున్న సుఖం బలవంతం చేసి దక్కించింది.ఈ చోద్యం తనంత తాను చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది. దోవ వెంబడి, పురివిప్పిన బుక్కా పావురం మల్లే చిట్టి ఏదో బరువెత్తి దించిన తేలికతో, నడిచిపోతూ - చంకనున్న పాపణ్ణి  ఆడించుకుంటూ గుమ్మంలో నిలుచున్న ఏ ఇల్లాలితోనో, ముచ్చటంతా చెప్పేసిందట!_ “మగవాడంటే ఎలాటి గండో అనుకున్నానమ్మా, ఆస్తమానం పసిపాపే!- కడు పెరిగి ఉంగపట్టాలి. లేకపోతే జాతి జాతి ఆకలితో అటమటించి పోతుంది!" ఇంత నీతి చెప్పిందట!చిట్టి ఈ మాటమీదే బ్రతికింది ఇన్నాళ్ళూ!లోకం...

NOW PLAYING

'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ

0:00 20:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 20 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on May 4, 2021.

What is this episode about?

హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు....

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!