'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన episode artwork

EPISODE · Aug 1, 2021 · 43 MIN

'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన

from Harshaneeyam

ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి కృతజ్ఞతలు. “ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహం గారు, కిటికీలోంచి బయటికి చూస్తూ. ఆయనకి చాలా చిరాగ్గా వుంది.‘నువ్వు ఇప్పుడిప్పుడే నన్ను వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నట్టు విన్పించింది ‘అబ్బాయ్’కి. అబ్బాయ్ పేరు వరప్రసాదరావు, అతనా గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడనడం కంటే సోఫాని ఆనుకొని ‘గోడ కుర్చీ’ వేసేడనడం సబవు. తను కూర్చుంటే సోఫాకి ఏం నొప్పెడుతుందో, ఏ కుళ్ళు అంటుకుంటే నరసింహంగారు, ఏం చేసేస్తారో అని భయపడుతున్నవాడిలా వున్నాడతను. .ఆ సాయంకాలం అతను నరసింహం గారింటికి వస్తూ వుంటే, అల్లంత దూరంలో వుండగానే టపటపా చినుకులు పడ్డం ఆరంభించాయి. వాళ్ళింటికి వచ్చేసరికి అతని చొక్కా వొంటికి అతుక్కుపోయింది. ఎత్తుగా దువ్విన జాత్తు అణగారిపోయి బుర్రకి అంటుకుపోయింది. నీళ్ళతో కలిపి, నూనె తలమీంచి కారి మొహమంతా జిడ్డులా తయారయింది. నరసింహంగారి ఇంటికి వచ్చాక మెట్లెక్కి, వరండాలో నుంచుని రుమాలుతో – తల తుడుచుకోవాలో, మొహం తుడుచుకోవాలో తేల్చుకోలేక మోచేతులు తుడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కేడతను.ఆ సమయంలో నరసింహం గారొక్కరే ఇంట్లో వున్నాడు. ఆయన కొడుకూ, కోడలూ, మనవలూ అంతా ఏదో పార్టీకి వెళ్ళేరు. –కాలింగ్ బెల్ విని ఆయనే తలుపు తీసేడు. తలుపు తియ్యగానే – చామనచాయవాడు, జిడ్డుమోమువాడు, రెండుపదుల వయసువాడు, బక్క పలుచనివాడు – వర ప్రసాదుడు కనిపించాడు. అతని రూపురేఖా విలాసాలు చూసేక, లోపలకు రమ్మనాలో, బైటవుంచి ‘ఏవరికోసవని’ అడగాలో తేల్చుకోలేక డోర్ నాబ్ పట్టుకొని ఒక్క క్షణం ఆలా నిల్చుండిపోయేడాయన..నరసింహంగారిని చూడగానే వరప్రసాదరావు నోరు పెగల్లేదు. పెద్దపులిని చూచినట్టు ఒక్కసారి జడుసుకున్నాడు. కనిపించగానే వినయంగా నమస్కారం చెయ్యమని మరీ మరి చెప్పి పంపించిన తాతగారి మాటే మర్చిపోయేడు. నరసింహంగారి మొహం చూసూనే ఎందుకోగాని గాభరాపడిపోయేడా కుర్రవాడు.నరసింహంగారికి ముఖంలో రంగులు మార్చడంలో ఒక ప్రాక్టీసు వుంది. ఆయన తన చిన్న మనవడితో ఆడుకుంటున్నప్పుడు ఎంతగా బోసి నవ్వులు చిందిస్తాడో, అదే సమయంలో పని కుర్రాడితో మాట్లాడవలసొస్తే అంత కటువుగానూ వుండగలడు. పూర్వంకూడా తన క్లయింట్లతోనూ, జడీలతోనూ ఎంత మృదు మధురంగా మాట్లాడేవాడో తమ వూళ్ళో రైతులతోటి, కూలీలతోటీ అంత కర్కశంగా మాట్లాడేవాడాయన. ఎవరెనా కొత్తవాళ్ళను చూసీ చూడ్డంతోపే, విధిగా ఆయన ముఖంలో రంగులు మారతాయి. అవతలవాణ్ణి చూస్తూనే ఒక అంచనా వేసుకొంటాడు. దాంతో ముఖం ప్రసన్నంగా పెట్టడం ‘గంభీరంగా పెట్టడవా’ ‘ప్రసన్న గంభీరంగా పెట్టడవాఁ’ అన్నది తేల్చుకొంటాడు.కాని వరప్రసాదరావుని చూసి ఎలా ముఖం పెట్టాలో ఆయనకి వెంటనే తెలియక తటపటాయించాడు.ఇంతలో ఆ కుర్రవాడు జేబులోంచి ఓ వుత్తరం తీసి ఇచ్చేడు. అది చూస్తూనే, అయోమయపు రంగులోంచి కొంచెం ప్రసన్నపు రంగులోకి మొహాన్ని మార్చుకొన్నాడు నరసింహంగారు.“రా లోపలికి” అన్నాడాయన.తను వచ్చిన పని సగం అయిపోయినట్టేననిపించి, చిన్న పొంగు పొంగిపోయేడు. వరప్రసాదరావు,కాని,వెంటనే నరసింహంగారు జోళ్ళు ………. అంటూ అర్థాంతరంగా ఆగిపోవడంతో ఒక్కసారి కుంగిపోయాడా అబ్బాయి.ఆ కుర్రవాడి జోళ్ళు చిరు బురదతో వున్నాయి. “ఆయన చెప్పబట్టి సరిపోయింది కాని, అమ్మబాబోయ్! ఆ జోళ్ళతో లోపలికి వచ్చేస్తే ఇంకేదన్నా వుందా?” అనుకొని మనసులోనే ఫెడీ ఫెడీమని లెంపలు వాయించేసుకొన్నాడు వరప్రసాద రావు.జోళ్ళు బైటే వదిలి, లోపలికి వచ్చి సోఫాముందు ‘గోడ కుర్చీ’ వేసేడా కుర్రవాడు. “సరిగా కూర్చో పరవాలేదు’ అందామని నోటిదాకా వచ్చింది కాని మరెంచేతో నరసింహం గారు అనలేదు.ఆ కుర్రవాడి తాతగారూ, నరసింహం గారూ, చిన్నప్పుడు క్లాసుమేట్సు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ – ‘చదువు లేకపోతే మన బతుక్కి మరో దారీ తెన్నూ లేదు. చదువుకోకపోతే మట్టి కొట్టుకు పోతాం సుమా – అనుకొని కష్టపడి చదువుకొన్న వాళ్లే కానీ , పెద్దలు చెప్పినట్టు రోజులు అందరికీ ఒక్కేలా వుండవు కదా!నరసింహంగారికి రోజులు మారేయి. దశ మళ్ళింది. ఆ రోజుల్లో కుర్ర నరసింహాన్ని చూసి – తన బాగుకోసం, అవసరం వస్తే – ‘అమ్మ లేదు, నాన్న లేడు, అన్న, చెలి ఎవరూ లేరు లేరంటే లేరు’ అని ఈ కుర్రవాడు అనుకోగలడని ఎలా పసిగట్టారో గాని, పసిగట్టేరొక పెద్ద ప్లీడరుగారు. అంత చిన్న వయసులోనే ఆ కుర్రవాడికి ‘జ్ఞానోదయం’ కలిగినందుకు తెగ మురిసి పోయేడాయన.ఆ తరువాత నరసింహంగారు – ఆ ప్లీడరు గారింటికి ఇల్లరికపుటల్లుడుగా వెళ్ళేడు; మద్రాసుకీ ‘లా’ స్టూడెంటుగా వెళ్ళేడు. కోర్టుకి మావగారి జూనియర్ గా వెళ్ళేడు. ఆ తరువాత ఎన్నెన్నో చోట్లకి ఎంతో గొప్పగా, గర్వంగా వెళ్ళేడు.నరసింహంగారికి భగవంతుడంటే, చెప్పలేనంత భక్తి. కాని ఆయనకి మావగారంటే అంతకన్న ఒక్క పిసరు ఎక్కువ భక్తి. ఆయన పావుగంట సేపు మాట్లాడేడంటే అందులో అరగంట సేపు మావగారిని గురించి రిఫరెన్సే వుంటుంది.నరసింహంగారికిప్పుడు ముగ్గురంటే ముగ్గురే మగపిల్లలు. ఆయన పెద్ద కొడుకు బొంబాయి దగ్గిర ఏదో ఆయిల్ రిఫెనరీలో జనరల్ మేనేజర్ హోదాకి ఒకే ఒక మెట్టు కింద వున్నాడు. అందుగురించి నరసింహంగారెప్పుడూ చిరాకు పడుతూనే వుంటారు. రెండో కొడుకు ఈ వూళ్ళోనే యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసరుగా వున్నాడు. అతను ఇప్పట్లో ప్రొఫెసరవాలంటే, ఇప్పుడు ప్రొఫెసరుగా వున్నాయన హఠాత్తుగా హారీమవడం ఒక్కటే మార్గం.అది తల్చుకున్నప్పుడల్లా నరసింహంగారికి ఆ ప్రొఫెసర్ పీక పిసికేద్దాం అన్నంత కోపం వస్తూంటుంది. మరి మూడోవాడు అమెరికాలో రిసెర్చి చేస్తున్నాడు. అమెరికాలో ‘స్టూడెంట్ రివోల్ట్’ గురించి ఎప్పుడయినా పేపర్లో చూసినప్పుడు కించిత్తు గాభరా పడినా, మొత్తంమీద నరసింహంగారికి ఆ చిన్నవాణ్ణి గురించిన చింతేమీ లేదు.ఇక ఆ సమయంలో నరసింహంగారి పుట్టింటివాళ్ళ దశకూడా మారింది. చదువు చదివి నాలుగు రాళ్ళు సంపాదించి, కుటుంబాన్ని లేవనెత్తుతాడనుకున్న నరసింహం, నడి సముద్రంలో సంసారాన్ని వదిలి పూలపడవలో తన మానాన్న తను పారిపోతే –ఆయన పెద్ద చెల్లెలు చాలాకాలం పెళ్ళి కాక అలా వుండి వుండి ఆఖరికి వురి పోసుకు చచ్చిపోయింది. రెండో చెల్లి ఎవరో ముసిలి ప్లీడరుగారికి మూడో భార్యగా వెళ్ళిపోయింది.ఆయన అన్నయ్య టీ.బీ.తో ఆమధ్యనే పోయేడు. అన్నగారి భార్యా, పిల్లలు అంతా ఎక్కడుంటున్నారో, ఏవయిపోయారో ఎవరికీ తెలీదు. తండ్రి చిన్నప్పుడే పోయినా నరసింహంగారి తల్లి మటుకు చాలాకాలం పీనుగు బతుకు బతికింది. ముసిలిముద్ద అయిపోయి, పక్క మీద బట్ట మార్చిన వాళ్ళు లేక, ఆఖరవస్థలో మరీ ఘోరంగా రోజుకి నలభైసార్లు మంచం దింపేస్తూ వుంటే; వీధరుగుమీద పారేస్తే బతికుండగానే చీమలు పట్టిపోయి, ఈగలు ముసిరిపోయి, దెయ్యపు చూపు వచ్చేసి; మందుమాకుల్లేక, చల్లనిమాట మాటాడే మనిషి లేక, నానాయాతనాపడి ఆవిడ ఆఖరికి ఆ దీనబాంధవుడి సన్నిధి చేరుకుంది.మరి అదే సమయంలో వరప్రసాదరావు తాతగారి ‘దశ’ కూడా మళ్ళింది. హఠాత్తుగా తండ్రి చచ్చిపోవడంతో, ఇంటరుతోనే చదువాపేసాడాయన. ఆ తరువాత చిన్న చిన్న వుద్యోగాలు చాలా చేసేడు. “పిల్లకింత తిండి పెట్టగలిగినవాడు చాలు” ననుకొంటున్న మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఆయనకిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకూ.కొడుకు ఏదో ఫేక్టరీలో పని చేస్తూ నిచ్చెన జారి, నీళ్ళ టాంకులో పడి చచ్చిపోయేడు. ఫేక్టరీ యజమానులు మురిపించి మురిపించి యిచ్చిన కాంపెన్సేషన్ చేజిక్కించుకొని అతని భార్య పుట్టింటికి చేరింది. రెండో కూతురు కాపరం పరవాలేదు కాని, పెద్ద దాని మొగుడికి స్థిరం లేదు. అతను నెల్లాళ్ళు వుద్యోగం చేస్తే, రెండు నెలలు ఇంట్లో కూర్చుంటాడు. రెండునెల్లు ఇంట్లో కూర్చుంటే నాలుగు నెలలపాటు ఎక్కడిపోతాడో ఏవిటో పత్తా లేకుండా పోతాడు. వాళ్ళకి అయిదుగురు పిల్లలు. పెద్దవాడు వరప్రసాదరావు,వరప్రసాదుణ్ణి వాళ్ళ తాతగారే బియస్సీదాకా చదివించేరు. ఆకాడికే బ్రహ్మాండవై పోయింది. అంతకి మించి ఆయనకీ శక్తి లేదు. అందుకే – వరప్రసాదరావు వుద్యోగం ప్రయత్నం మొదలు పెట్టాడు. ఏడెనిమిది నెల్లపాటు, అతను వుద్యోగం కోసం చెడ తిరిగేడు. ఇతను వుద్యోగం అడిగిన చోటల్లా, వాళ్ళు ఇతన్ని లంచం అడిగేరు: రికమండేషన్ లెటరడిగేరు. రెండూ అక్కర్లేనివాళ్ళు కులం అడిగారు. కులం సరిపోయిన చోట శాఖ అడిగేరు. అన్నీ అడిగేరు కాని ఇతనడిగింది మట్టుకు ఇవ్వలేదు.అలాంటప్పుడు – గోదావరి వరదలో కొట్టుకుపోతున్న వాడికి, గడ్డి కుప్ప దొరికినట్లు నరసింహంగారు గుర్తుకొచ్చేడు. ఆయన్ని గురించి తాతగారు చెప్పింది వింటూ వుంటే, కల్పవృక్షమో కామధేనువో మన తాతగారి బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు ఫీలయేడు వరప్రసాదరావు, మనవడి చేతికి వుత్తరం ఇచ్చి పంపించారు తాతగారు.“ఈ బాలకుడు నా మనవడనీ; వీడి తండ్రికి స్థిరం లేదనీ, అందువల్ల తల్లీ నల్గురుపిల్లలూ మలమల మాడిపోతున్నారనీ, మీ పిల్లల ద్వారా కాని, మీకు తెలిసిన పెద్దవాళ్ళ ద్వారా కాని చిన్నదైనా సరే, ఏదో వుద్యోగం ఒకటి ఇప్పిస్తే, చచ్చి మీ కడుపున పుడతాసనీ; ఈ వుపకారం చేసి పెట్టినందుకు ఆ అనాధరక్షకుడు మీకు ఇందుకు వెయ్యి రెట్లు మంచి చెయ్యకపోడనీ; స్వయంగా వచ్చి కష్టసుఖాలు చెప్పుకొందికి తన కాళ్ళు స్వాధీనంలోకి రావడం లేదనీ”- ఆ వుత్తరంలో వుంది.వరప్రసాదరావు, సోఫాలో సరిగా కూర్చుందామని రెండు మూడు సార్లు అనుకొన్నాడు కాని ఎందుకో భయపడిపోయాడు. తలెత్తి చూశాడు. నరసింహంగారు ఉత్తరం చదువుతున్నాడు. ఆయన వెనకాల గోడమీద ఫొటో చూసి గతుక్కుమన్నాడా కుర్రవాడు.ఆ ఫొటో అందమైన ప్రేములో బిగించి వుంది. అది ఎవరో పెద్దమనిషి ఫొటో, ఆ పెద్దమనిషి ముఖం – గంభీరంగా పెట్టబోయి, భయంకరంగా పెట్టినట్టు వుంది. పెద్ద తలపాగాతో ఆయన తల రెండింతలు పెరిగినట్టు కనిపిస్తోంది. దోసగింజంత బొట్టు, ఆయన కనుబొమల మధ్య మెరుస్తోంది. ఎక్కుపెట్టిన ఆయన మీసాలు, ఎవరివో తెచ్చి అతికించుకున్నట్లు వికృతంగా వున్నాయి. నల్లటి చీకటి కోటులోంచి బయటకు వచ్చిన ఆయన కంఠం, తెల్లగా సున్నం వేసుకొన్నట్లు వుంది.మొత్తంమీద ఆ ఫొటోలో వున్న విశేషం ఏమిటోగాని దానివేపు మరొక్కమారు చూడ్డానికి భయపడ్డాడు వరప్రసాదరావు.నరసింహంగారు పుత్తరం చదివి, ముడిచి టీపాయ్ మీద పెడుతూ ఒక నిట్టూర్పు, విడిచాడు. పరధ్యానంగా వున్న వర ప్రసాదరావు ఫొటోలో వున్నాయనే నిట్టూర్చేడనుకొనివులిక్కిపడ్డాడు. అయితే, యిప్పుడు మీ తాతకి వొంట్లో కులాసాగానే వుందా?……. అఫ్కోర్స్ ఓల్డ్ ఏజ్. నాయీడు వాడు. నాకూ యీమధ్య వొంట్లో బావుండటం లేదబ్బాయ్ ! మా పిల్లలు ‘ఇంకా మీరు కోర్టుకి వెళ్ళడం ఏవిటి నాన్నారూ!’ అంటే ఏణ్నర్థం నుంచి ప్రాక్టీసు వదిలేసేను……. మీ తాత ఇంకా ఏదైనా పని చేస్తున్నాడా?….. అని ఏదో ఆలోచిస్తున్న వాడిలా ఆగిపోయేడు నరసింహంగారు.వరప్రసాదరావు ఏం మాట్లాడలేదు. అతనికిందాకట్నించి చేతులు ఎక్కడ పెట్టుకోవడమన్నది పెద్ద సమస్య అయిపోయింది. సోఫా మీద చేతులు పెట్టడానికి అతనికి భయంగా వుంది. ముణుకులమీద పెట్టుకుంటే కూర్చోడం కష్టంగా వుంది.దానికి తోడు రాగానే నమస్కారం చేయ్యలేదన్న విషయం, అతనికి హఠాత్తుగా గుర్తుకి వచ్చింది. మహా పాపకార్యం ఏదో చేసినట్టు భయపడిపోయాడు. “ఇప్పుడు మధ్యలో నమస్కారం చేస్తే ఏం బావుంటుంది? మరింక వుండబటలేక పైకే “ప్చ్” అనేసాడు.“నేను ఎవరితో చెప్పాలంటే వాళ్లతో చెప్తానబ్బాయ్! కాని చూడూ, వెధవ రోజులెలా వున్నాయంటే, మనెదురుగుండా, “అలాగే సార్ ! తప్పకుండా” అన్న వెధవలే వెనకాతలకెళ్ళి మన మాటే మర్చిపోతారు. పూర్వపు రోజులు కావు గదా. ఓ మాట అన్నారూ అంటే, దానిమీద నిలబడతారు – అని నమ్మడానికి! నాకేవిటంటే ఓసారి చెప్పింతరవాత అది జరక్కపోతే నన్నే ఇన్సల్ట్ చేసినట్టు ఫీలవుతాను. అడిగి లేదనిపించుకోడంకంటె, వూరుకోవడం వుత్తమం అనిపిస్తోంది. నాకు వీళ్ళని చూస్తుంటే…… పోనీ మావాడితో చెప్దాం అంటే, అవడానికి మా వాడు అసిస్టెంటు ప్రొఫెసరే అనుకో కాని, వాడి నెత్తిమీద మరో...

NOW PLAYING

'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన

0:00 43:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 43 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on August 1, 2021.

What is this episode about?

ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!