EPISODE · May 31, 2023 · 18 MIN
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 2 | Pragathi Premikulu episode 2 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 2' Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.. బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు. ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 2 చదవండి.. విశ్వవిఖ్యాత భారతీయుడు శ్రీ వివేకానంద స్వామీజీ మన జాతి ఔన్నత్యాన్ని జగతి నలుదిశలా తెలియజేయుటకు జన్మించారు. ఆ మహాపురుషుని జననం 1863వ సంవత్సరం జనవరి 12వ తేది. తల్లిదండ్రులు భువనేశ్వరీ దేవి, విశ్వనాథుడు. చాలాకాలం పుత్ర సంతానం లేని ఆ తల్లి, కాశీ విశ్వేశ్వరుని దీక్షగా పూజింపగా, ఆ మహనీయుడు జన్మించారు. ఆ పుణ్య దంపతులు వారికి నరేంద్రుడు అని పేరు పెట్టారు. వారి జననం మన భారతావనిలో జరగకున్నా, వారు శ్రీ రామకృష్ణ పరమహంసతో 1881వ సం॥ నవంబర్ నెలలో దక్షిణేశ్వరంలో కలియక వున్నా, వారు బ్రహ్మచర్య పరిపాలన చేయకవున్నా, 1893 సం॥ సెప్టెంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకూ చికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలో పాల్గొనకన వున్నా, యీ మన పవిత్ర భారతావనిలో మనదైన హైందవతా స్థానం, యితర దేశాలలో యీనాడు వున్న గుర్తింపు, గౌరవం, ప్రతిష్ట వేరే రీతిగా వుండేది. యీ దేశ ప్రజలు ఆ మహాపురుషుణ్ణి, ఆ చరిత్ర నాయకుడిని ముఖ్యంగా మన యువత మరువకూడదు. దేశంలోని అన్ని పాఠశాలలో, కాలేజీలలో, కార్యాలయంలో వారి వర్ణ చిత్రపటాన్ని ఆవిష్కరించి తీరాలి. వారిని హైందవ, అధ్వయిత పితామహగా, గౌరవించాలి. వారి చిత్తరవు ముందు చేతులు జోడించాలి. పాశ్చాత్యులు ఆశ్చపోయే రీతిగా, శిష్యులుగా మారే రీతిగా, మన హైందవతను గురించి, అధ్వయితాన్ని గురించి, ఆ కారణ జన్ముడు, యుగ పురుషుడు, విశ్వమత మహాసభలో చేసిన సుప్రసంగం అనితర సాధ్యం. యావత్ ప్రపంచానికీ హైందవ ఔన్నత్యాన్ని వారు విశదీకరించిన రీతి, మన జాతికి తరతరాలకు గర్వకారణం. నరేంద్ర నామధేయంతో, బాల్యంలో ఏకసంతాగ్రాహిగా పేరు గాంచి, ఆటపాటలతో ధార్మిక చింతనలతో అందరినీ అలరించిన స్వామి, యువకుడై కలకత్తా ప్రసిడెన్సీ కళాశాలలో, మొదటి పర్యాయం శ్రీరామకృష్ణులవారి పేరును నరేంద్రుడు, తన కళాశాల అధ్యక్షుడైన విలియం హేస్టీ నుండి విన్నారు. తర్వాత కొద్ది రోజులలోనే సురేంద్రనాథ మిత్ర అనే ఒక భక్తుని యింట జరిగిన మతోత్సవంలో తొలిసారి నరేంద్రుడు శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులను దర్శించారు. ఆ ఉత్సవంలో నరేంద్రుడు పాడిన పాటలను విని శ్రీరామకృష్ణులు అతన్ని సమీపించి, దక్షిణేశ్వరానికి రమ్మని ఆహ్వానించారు. 1881వ సం॥ నవంబర్లో సురేంద్రనాథమిత్రతో కలసి నరేంద్రుడు మొదటిసారిగా దక్షిణేశ్వరానికి వెళ్ళి గురుదేవులను దర్శించారు. ఆ ద్వితీయ సంగమంలోనే శ్రీరామకృష్ణులు నరేంద్రుని చేయి పట్టుకొని, వసారా గదిలోనికి తీసుకొని వెళ్ళి, చిరపరిచితుని వలే "ఇంత ఆలస్యంగా రావడం నీకు న్యాయమా.. ? నీ నిమిత్తం నేనెంతగా నిరీక్షిస్తూ వున్నానో ఒక్కమారైనా నీవు ఆలోచించావా.. ? తుచ్ఛమైన ప్రాపంచిక విషయాలను విని విని నా చెవులు, చిల్లులు పడ్డాయే.. ! నా అంతరంగ భావాలను ఎవరితో చెప్పుకొని పాలు పంచుకోవాలో తెలియక నా హృదయం పగిలిపోయే స్థితికి వచ్చింది." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/bBTUAZOpuAY
Embed this episode
NOW PLAYING
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 2 | Pragathi Premikulu episode 2 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.