PODCAST · arts
"కొప్పర్తి కథావాహిని "
by Rambabu Kopparthy
Stories Rendered By Rambabu Kopparthy
-
106
-
105
-
104
-
103
పడమటి సంధ్యారాగం. రచయిత: శ్రీ విన్నకోట రామచంద్ర కౌండిన్య గారు.
పడమటి సంధ్యారాగం. రచయిత: శ్రీ విన్నకోట రామచంద్ర కౌండిన్య గారు.
-
102
-
101
-
100
-
99
-
98
-
97
-
96
Ash Tray Telugu Story by Chaganti Tulasi garu | "యాష్ ట్రే" - చాగంటి తులసి గారు.
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి , కథాభిమానులకు నమస్కారం.🙏💐💐 ఈ వారం మనం వినబోయే కథ "యాష్ ట్రే " రచయిత్రి చాగంటి తులసి గారు. సాహితీ రంగంలో వారసత్వ సంపద అంది పుచ్చుకుని పుట్టిన కొంతమంది అదృష్టవంతుల్లో తులసి గారు ఒకరు. స్వర్గీయ చాగంటి సోమయాజులు (చా.సో ) గారి కుమార్తె. సాహిత్య వాతావరణంలో, వారి తండ్రిగారికి స్నేహితులైన శ్రీ శ్రీ , నారాయణ బాబు , రోణంకి, ఆరుద్ర ఇత్యాదుల మధ్య పెరిగిన రచయిత్రి. హిందీ సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఒడియా , హిందీ , ఇంగ్లీష్ , తెలుగు భాషల్లో అనువాద , స్వతంత్ర రచనలు చేశారు. వారి ప్రస్తుత కథ , యాష్ ట్రే....పెళ్లి విషయంలో స్త్రీకి స్వేచ్ఛ ఉండాలి , ఏ ఒత్తిడులకి లొంగ కూడదు....ఏ వయస్సులో అయినా కూడా అని తేల్చి చెప్పిన కథ. స్త్రీ జీవితానికి పెళ్లి పరమావధి కాదు , స్వతంత్రంగా జీవించి , ఉన్నతిని సాధించి , లోకానికి తాను ఏమిటో నిరూపించి చూపించిన ఒక స్త్రీ కథ. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకపోవడం , పరిస్థితులకు లొంగి పోకపోవడం , ఎదురొడ్డి నిలబడడం ఈ కథలో నాయిక లక్షణాలు. అభ్యుదయ భావాలు తులసి గారి ప్రతి రచనలోను ప్రతిఫలిస్తూ ఆమెను ఆమె తండ్రి చా.సో గారికి వారసురాలిగా నిలబెట్టాయి. తండ్రి గారి పేరు మీద ఏటా చాసో పురస్కారం అందిస్తున్నారు. ఈ కథ రికార్డ్ చెయ్యడానికి , ముందుగా విని సహృదయంతో సూచనలు చేసిన తులసి గారికి ప్రత్యేకంగా , కృతజ్ఞతలు , ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. వినండి , చాగంటి తులసి గారి కథ " యాష్ ట్రే " 🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada phone 96770 15158 Mail ID [email protected]
-
95
-
94
నా ఇల్లు ఎక్కడ?- రచయిత: శ్రీ ముకుంద రామారావు గారు.
💐💐సాహిత్యాభిమానులకు నమస్కారం 🙏"నా ఇల్లెక్కడ ?" కథ. రచయిత శ్రీ ముకుంద రామారావు గారు. కవి , కథకుడు , వ్యాసకర్త , అనువాదకుడు , మనసులోని భావుకత్వాన్ని మాటల్లోకి పొదగగల రచయిత శ్రీ ముకుంద రామారావుగారు.... 9 నవంబర్ 1944 న , ఖరగ్ పూర్ లో జన్మించారు. ప్రస్తుత నివాసం హైద్రాబాద్ . ఫోన్ నెంబర్ 99083 47273. మెయిల్ [email protected] కవిత్వము , కథలు , వ్యాసాలు రాసారు. అనువాదం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం తో బాటు , అనేక ఇతర పురస్కారాలు అందుకున్నారు. సౌమ్యులు, మృదు స్వభావి , ఆలోచనా శీలి. ముకుంద రామారావు గారి ఈ కథ ఆరు నెలల క్రితం నాకు దొరికింది. చదివి భద్రంగా దాచుకున్నాను. ఆ కథ రికార్డ్ చెయ్యాలి అని మనసులో ఉన్నా ఎందువల్లో జత పడలేదు. క్రితం సెప్టెంబర్ నెల 21 ప్రపంచ అల్జీమర్స్ రోజు అని అనుకోకుండా తెలిసింది. ఆరోజు మా చెల్లెలు డాక్టర్ మణి తోలేటి ఆ సమస్యకు గురి అయిన వారికి కుటుంబ సభ్యులు సమాజము అందించవలసిన సహాయ సహకారాల గురించి హన్స్ ఇండియా లో ఒక వ్యాసం రాసింది. ఆ వ్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తే బావుంటుంది అన్నది. ఆ క్షణంలో నా మనసులోకి ఈ కథ మెదిలింది. అనువాద రచనలో అందె వేసిన ముకుంద రామారావు గారి ఈ కథ అదే విషయానికి చెందినది . వ్యాసాన్ని అనువదించడం పని పక్కన పెట్టి , భద్రంగా దాచిన కథ బయటికి తీసి మరోసారి చదివాను. ఒకటి రెండు గంటల్లో సంభవించిన ఒక సంఘటనని , ఏ అలంకారాలూ , వర్ణనలు లేకుండా , ముఖాముఖి కూచుని , వినడానికి ఆసక్తి కలిగేలా చక్కటి తెలుగు భాషలో కథ రాయడం కష్టం.కానీ ఆ పని తేలిగ్గా సాధించారు ముకుందరామారావు గారు. మనలో ప్రతి ఒక్కరికి , జ్ఞాపకశక్తి ఎంత బలమైనదో , మతి మరుపు అంత బలహీనం చేసే అంశం. వయోభారం వల్ల అనుకుంటాము కానీ అది ఒక శారీరక రుగ్మత అని తెలుసుకునేలోగానే చాపకింద నీరులాగా వచ్చి చేరే సమస్య అల్జీమర్స్ . కథలో ఎక్కడా వ్యాధి పేరుకూడా చెప్పరు రచయిత.కానీ దానివల్ల ఎదురయ్యే సమస్యని కళ్ళకు కట్టి చూపిస్తారు. మన ఇంట్లో , మన మధ్య జరిగిన , జరిగేందుకు అవకాశం ఉన్న కథ అని అనడానికి వీలు లేని వాస్తవం ఈ కథ. వినండి. 🙏కొప్పర్తి రాంబాబు , విజయవాడ ఫోన్ 96770 15158.
-
93
-
92
-
91
కీ శే బాల సుబ్రహ్మణ్యం గారికి, శ్రీరమణ గారి అక్షర తూణీర నివాళి
🙏 బాలూ గారిని నా కథానాయకుడు అని గర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది "మిథునం " కథా రచయిత శ్రీ రమణ గారే ! బాలూ ఆయన సృష్టించిన అప్పదాసుని "మిథునం" సినిమా ద్వారా మన కళ్ళముందు నిలిపారు. శ్రీరమణ గారికి బాపూ -బాలూ వీరిద్దరితో అనుబంధము -స్నేహము. గాన గంధర్వుడికి కి నివాళి అర్పిస్తూ శ్రీరమణ గారి అక్షర తూణీరం ...."తెలుగోడి పొగరు, గర్వం అణిగాయి" బాలూ గురించి అరుదైన విషయాలు , అపురూప జ్ఞాపకాలు ...వినండి. గళం :కొప్పర్తి రాంబాబు , విజయవాడ.
-
90
-
89
"ఆ చేతులెవరివో"- కథ రచయిత: శ్రీ రమణ గారు
శ్రీ రమణ గారి పదచిత్రం. "ఆ చేతులు ఎవరివో ! సాహిత్యాభిమానులకు నమస్కారం. సాహిత్యం హృదయ సంస్కారాన్ని పెంపొందించాలి అని నా అభిప్రాయం. కథ , కవిత , వ్యాసం , నవల , నాటకం ఏదైనా చదివినప్పుడు , విన్నప్పుడు లేదా చూసినప్పుడు ఒక హృదయ స్పందన కలిగించాలి. అప్పుడే సాహిత్యం యొక్క ప్రయోజనం నెరవేరినట్టు. రచయిత ఒక మంచి విషయాన్ని చెప్పదల్చుకున్నప్పుడు ఆ విషయ పరిథి , విస్తృతిని బట్టి , తన మనసులోని భావము , ఆలోచనను బట్టి , రచనకు రూపం కల్పిస్తాడు. శ్రీ రమణ గారు కథా రచయితగా సుప్రసిద్ధులు అయినప్పటికీ , పత్రికా రచయితగా ఆయన అయిదు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి దిన , వార పత్రికలలో "రంగుల రాట్నం" , ఫీచర్ రచయితగా , ఆంధ్రప్రభ వార పత్రికలో .."శ్రీఛానల్ " నవ్య వార పత్రికకు ఎడిటర్ గా "మొదటి పేజీ", ప్రస్తుతం ప్రతి శనివారం సాక్షి దిన పత్రికలో "అక్షర తూణీరం" పేరుతో....వందలకొద్దీ విషయాల మీద తనదైన శైలిలో వ్యాఖ్యలు, వ్యాసాలు వెలువరిస్తున్నారు. ఆయన రచనల్లో చాలా వాటిలో మానవత్వ భావన అంతర్లీనంగా బలంగా ఉంటుంది. బంగారు మురుగు కథలో ఆయన సృష్టించిన బామ్మ పాత్ర జీవితం పట్ల ఆయనకు గల విశాల దృక్పథాన్ని మూర్తీభవించిన పాత్రగా చెప్పచ్చు. ఈ పదచిత్రం "ఆ చేతులు ఎవరివో " లో ఒక పేదరాలు , బిడ్డల ఆకలి తీర్చడానికి ఒక వేద విదుడైన అగ్రహారీకుని చేలో పండిన వరి మోపు దొంగిలించడానికి సిద్ధ పడితే ఆ మహానుభావుడు ఆమెకు అదృశ్య హస్తం అందించి సాయపడతాడు. ఆయన పంట చేలోనే తాను వరి మోపు తీసుకున్నట్టు ఆ మోపుతో చిక్కుకుని వచ్చిన ఆయన యజ్ఞోపవీతం ఆమెకు తెలియచెప్తుంది. ఆయన హృదయ ఔన్నత్యానికి నివాళులు అర్పిస్తూ , చేసిన తప్పు ఒప్పు కుని ఆ పేద మహిళ పులు కడిగిన ముత్యంగా నిలుస్తుంది , ఆయన దృష్టిలో , భగవంతుని ముందు. వినండి, శ్రీరమణ గారి పద చిత్రం "ఆ చేతులు ఎవరివో !" 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada.
-
88
-
87
వల్లూరు శివప్రసాద్ గారి కథ - " ఇస్ మిట్టిసే తిలక్ కరో " 🙇🏾♂️ 🇮🇳 💐
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 💐💐🙏 ఈ వారం మనం వినబోయే కథ "ఇస్ మిట్టిసే తిలక్ కరో !" రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ శివప్రసాద్ కేవలం కథా రచయిత మాత్రమే కాదు , నాటక రచయిత , పుస్తక ప్రచురణ కర్త , సాహిత్య కార్యక్రమాల నిర్వహకునిగా ....సాహిత్యమే జీవితంగా ప్రయాణం సాగిస్తున్న వ్యక్తి. సాహిత్యం పట్ల వారికి ఉన్న ఉద్యమ స్పూర్తి సరిపోల్చలేనిది. ఉత్తమ నాటక రచయితగా ఆరు సార్లు నంది అవార్డు పొందారు. హింసధ్వని , వానప్రస్థం , ధ్వంసరచన నాటికలు బంగారు నంది అవార్డు పొందాయి. పిల్లలకోసం అనేక నాటికలు రచించారు. విద్యార్థులు వారి రచనల పై చేసిన పరిశోధనలకు రెండు విశ్వ విద్యాలయాలు డాక్టరేట్ పట్టా , ఎంఫిల్ డిగ్రీలు ప్రదానం చేశాయి. ప్రస్తుత కథ " ఇస్ మిట్టిసే తిలక్ కరో " దేశభక్తిని చాటే సందేశాత్మక కథ.మనదేశం నుండి గత 50 ఏళ్లలో ఎందరో ప్రతిభావంతులు విదేశాలకు వెళ్లి అక్కడ రాణించారు , రాణిస్తున్నారు. తిరిగి రామంటున్నారు. మనం కూడా రమ్మని , రావద్దనీ రెండురకాల సలహాలు చెప్తున్నాము. కానీ అక్కడ ఉన్న వారిలో అధిక శాతం మంది ప్రాణాలు , మమకారం మాతృదేశం పై నిలువుకున్న వారే ! ఏదేశమేగినా ఎందుకాలిడినా , ఏ పీఠ మెక్కినా ....మాతృ భూమిని మరువని వారే. అటువంటి ఐశ్వర్య వంతులైన ఒక నాలుగు కుటుంబాల్లో...ఉన్న వ్యక్తులతో స్నేహం కలిగిన ఒకానొక సామాన్య పేద కుటుంబానికి చెందిన వ్యక్తి , భారతదేశం నుండి కానుకగా , తల్లి తండ్రి భార్యా పిల్లలు కానుకగా అమెరికా ఏం పంపించారు....ఆ కానుక ఆ వ్యక్తి మనసులోనే కాకుండా వలస బాట పట్టిన ఆ మేధావి వర్గానికి ఏ విధమైన ఉద్వేగ భరితమైన సందేశాన్ని అందించింది కథలో చూడవచ్చు. "వినండి వల్లూరు శివప్రసాద్ గారి కథ " ఇస్ మిట్టిసే తిలక్ కరో " 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Mail [email protected]
-
86
ఆరుద్ర గారి కథ - "దీవెన"
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 💐💐🙏ఈ వారం మనం వినబోయే కథ "దీవెన "రచన కీ. శే. ఆరుద్ర గారు. సినీ గేయ కవిగా ప్రసిద్ధులైన ఆరుద్ర గారు , అభ్యుదయ కవి , సాహిత్యకారులు , విమర్శకులు , నాటక రచయిత అన్నిటినీ మించి సాహిత్య పరిశోధకులు. వీరి పరిశోధనా గ్రంథం "సమగ్ర ఆంధ్ర సాహిత్యం " సాహిత్యలోకంలో ఆరుద్ర గారికి శాశ్వత సమున్నత స్థానాన్ని కల్పించింది. కూనలమ్మ పదాలు , త్వమేవాహం , సినీవాలి , వేమన్న వేదం .... కవితా సంకలనాలు, ఇంకా విమర్శ గ్రంధాలు , నాటకాలు , నాటికలు , సినిమా పాటలు రచించారు. జ్యోతిష్యం , హస్త సాముద్రికం , మ్యాజిక్ , చదరంగం మొదలైన వాటిలో కూడా అసమాన ప్రతిభ కలిగిన మేధావి. ప్రస్తుత కథ " దీవెన " ఒక వివాహ వేడుకను , క్రతువును కళ్ళ ముందు నిలుపుతూ వివాహ మంత్రాలను కథలో కలిపి కథను నడిపిన రచన. మనుమరాలు కోడలు అయితే బాగుండు అని ఆశ పడిన ఒక అమ్మమ్మ ఆశ నెరవేరక పోయినా , మనసు తిప్పుకుని , మనుమరాలి వద్దే తన శేష జీవితం సుఖంగా , సంతోషంగా గడిచిపోతుంది అనే నమ్మికతో , అప్రయోజకుడు అయిన కొడుకును పక్కకు పెట్టి , తన యావదాస్తినీ మనుమరాలికి పెళ్లి కానుకగా చదివించి , మనుమరాలిని నిండు మనసుతో దీవించిన కథ...."దీవెన" .....వివాహంలో ఆశీర్వచనానికి ఉన్న " విలువను" విలువైన కానుకతో జత చేసి దీవించి రక్తసంబంధం యొక్క విలువను ఇనుమడించిన కథ. గడచిన ఆగస్ట్ 31 తేదీ శ్రీ ఆరుద్ర గారి జన్మదినం. తెలుగు సినిమాల్లో అద్భుతమైన పెళ్లి పాటలు రాశారు ఆరుద్రగారు ....పెళ్లి పుస్తకం సినిమాలో వారు రాసిన "శ్రీరస్తు శుభమస్తు ...శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం...ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం " అని వారు రాసిన పెళ్లి పాట గత పాతికేళ్లుగా ప్రతి పెళ్లి మండపం లోనూ వినిపిస్తూనే ఉన్న పాట. ఆరుద్ర గారిని స్మరించుకుంటూ వారి కథ "దీవెన " వినండి. 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Mail ID [email protected] మంచి సాహిత్య కార్యక్రమాలు వినడానికి.... కొప్పర్తిసాహితీ వాహిని యూ ట్యూబ్ ఛానల్ ను , లైక్ చెయ్యండి , షేర్ చెయ్యండి , సబ్స్క్రయిబ్ చెయ్యండి
-
85
రైలు బండిలో వైతాళికులు - రచయిత: శ్రీ రమణ గారు.
శ్రోతలకు నమస్కారం..... గిడుగు రామమూర్తి పంతులుగారి పుట్టినరోజు... తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా తెలుగు భాషకి సంబంధించి ఏదన్నా కొత్తదనం ఉండేలా చెయ్యాలి అని ఆలోచన కలిగినప్పుడు , చప్పున స్ఫూరించింది శ్రీ రమణ గారి " రైలు పెట్టెలో వైతాళికులు " హాస్య రూపకం దానికి శబ్ద రూపం ఇస్తే , ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులైన రచయితలు , వారి స్వరూప స్వభావాలు , వారి రచనా శైలులు , రీతులు హాస్య స్ఫోరకంగా చూపించే అవకాశం శ్రీ రమణ గారి ఈ రచన కల్పిస్తుంది , అనిపించింది. ఇందులోని కవుల రచయితల రచనా శైలుల్ని అనుకరిస్తూ శ్రీరమణ గారు ఇంతకుముందే ఎన్నో పేరడీలు రాశారు. అవన్నీ పాఠకుల్ని ఆనందపరిచాయి. ఇప్పుడు ఒక డజను మంది ప్రసిద్ధులైన ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతల్ని ఒక చోట చేర్చి ఒక పద చిత్రం రూపొందించారు శ్రీరమణ గారు. దాన్ని శబ్ద చిత్రంగా మార్చే ప్రయత్నం చేశాను. వినండి "రైలు బండిలో వైతాళికులు " శ్రీ రమణ గారి హాస్య రచనకు శబ్ద రూపం. 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Mail [email protected]
-
84
జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి రచన - " ఒక ఎలుక కథ ".
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏🏻💐💐 ఈ వారం మనం వినబోయే కథ "ఒక ఎలుక కథ " రచయిత శ్రీ రావూరి భరద్వాజ . రచయితగా ఏమాత్రం పరిచయం చెయ్యవలసిన అవసరం లేని మహా రచయిత శ్రీ రావూరి భరద్వాజ.సమాజాన్ని నిశితంగా పరిశీలించి మంచి చెడులను విస్పష్టంగా విడదీసి చూపి రచనలను చేసిన రచయిత భరద్వాజ గారు. భరద్వాజ గారికి జ్ఞానపీఠ బహుమతి తెచ్చిపెట్టిన వారి "పాకుడు రాళ్ళు " నవల సినీమాయాలోకపు ప్రతిబింబం. వారి కథలను శ్రీ శ్రీ గారు..."అధోజగత్ సహోదరుల కథా సరిత్సాగరం అని అభివర్ణించారు. విస్తృతంగా రచనలు చేసిన భరద్వాజ గారు , సాహిత్య సృష్టికోసం , వ్యవస్థ మీద కసితోటి , కొత్త పంథా సృష్టించడం కోసం , సైన్స్ అందరికీ అర్థం కావడానికి , ఉద్యోగ ధర్మంగా , విధిలేక డబ్బుకోసం రచనలు చేశాను అని నిజాయితీగా చెప్పిన వ్యక్తి. ప్రస్తుతం మనం వినబోయే ఒక ఎలుక కథ....సంక్షేమ పథకాల పేరుతో , ప్రజలను బుట్టలో వేసుకుని , వారిని బిచ్చగాళ్లుగా మార్చేస్తున్న మన ప్రభుత్వాల తీరుని గుర్తుకు తెచ్చే కథ. ప్రభుత్వాన్ని కాదు అంటే ప్రజల గతి ఏమిటో తేల్చి చెప్పే కథ. వినండి, జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి రచన " ఒక ఎలుక కథ ". 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Mail : [email protected]
-
83
"తిలదానం" - రచయిత కీ. శే. రెంటాల నాగేశ్వరరావు
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.💐💐🙏 ఈ వారం మనం వినబోయే కథ "తిలదానం" రచయిత కీ. శే. రెంటాల నాగేశ్వరరావు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో 2000 సంవత్సరంలో గంటా ముఫై నిముషాల చిత్రంగా రూపొందించబడిన సినిమాకు మూల కథ ఈ " తిలదానం." సినిమాకు సంభాషణలు కూడా మూల కథా రచయితే సమకూర్చారు. ఇక కథ విషయానికి వస్తే...వేద విద్యాధ్యయనం చేసి ఒకనాడు ఉచ్ఛస్థితిలో జీవించిన సద్ బ్రాహ్మణుడు పరిస్థితులు తారుమారు అయ్యి , స్వగ్రామాన్ని వదిలి హైద్రాబాద్ మహానగరం చేరుకుని , ఆయన విద్వత్తు అక్కరకు రాక , శవ వాహకునిగా...శని దానాలు స్వీకరించే స్థితికి దిగజారిన దురదృష్ట జీవి కథ. కమ్యూనిస్టు సిద్ధాంతాలు , మార్క్సిస్టు దృక్పధం ఏమేరకు సమ సమాజ స్థాపనకు దోహదం చేస్తుంది అని ఆచరణీయమైన ఆలోచన చెయ్యకుండా అర్థరహితమైన ఆదర్శాలు సిద్ధాంతాలు పట్టుకుని వేళ్ళాడుతూ....కుటుంబాన్ని జీవితాన్ని నాశనం చేసుకున్న యువకుని కథ. కర్మ కాండ మీద నమ్మకం విశ్వాసం కలిగిన శాస్త్రి మనవడికి గ్రహశాంతి జరిపించే క్రమంలో , తన శాస్త్ర పారంగతను లోకానికి ఏ విధంగా విదితమయ్యే లాగా చేశాడు , అదేసమయంలో రఘురాం తన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి తన ప్రాణానికి వెల కట్టిన ప్రభుత్వానికి లొంగిపోయి , ఆ డబ్బు కుటుంబానికి తన స్నేహితుని ద్వారా అందుతుంది అనుకుని నమ్మక ద్రోహానికి గురి అయ్యిన విషాద కథ " తిలదానం ". ఈ కథ 1991 ఆంధ్రప్రభ కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి గెలుచుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఆంగ్లంలోకి , ఇతర భారతీయ భాషల్లోకి అనువదింపబడింది.చలన చిత్రం గా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డ్ అందుకున్నది. వినండి. ఈ వారం కథ కీ. శే. రెంటాల నాగేశ్వరరావు గారి "తిలదానం" 🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Mail [email protected]
-
82
అత్తగారూ ఆవకాయ- రచయిత్రి: శ్రీమతి భానుమతీ రామకృష్ణ
💐💐కృష్ణాతీరం , విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏 ఈవారం మనం వినబోయే కథ "అత్తగారు -ఆవకాయ " రచయిత్రి బహుముఖ ప్రజ్ఞాశీలి శ్రీమతి భానుమతీ రామకృష్ణ. భానుమతి గారి గురించి తెలియని తెలుగు వారు ఉండరు. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న టైటిల్ కి సంపూర్ణంగా సరిపోయే స్త్రీ మూర్తి. నటిగా , గాయనిగా , దర్శక -నిర్మాతగా , రచయిత్రిగా , సినిమా స్టుడియో నిర్మాణ కర్తగా , తెలుగు వారు గర్వించదగ్గ "పద్మభూషణురాలు". తెలుగు వారు గర్వించదగ్గ ఆవిడకి "గర్వం" "అతిశయం"ఉన్నట్టు అనిపించడంలో తప్పు లేదు. ఆమెది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమె అత్తగారి కథ ల్లో "అత్తగారి పాత్ర " ఒక 3D పాత్ర అని ప్రశంసించారు ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు. అత్తగారి కథలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రస్తుత కథ , అత్తగారూ ఆవకాయ విషయానికి వస్తే , నిమ్మకాయ పచ్చడి పెట్టడం కూడా రాని అత్తగారు , ఐదువేల మామిడి కాయల ఆవకాయ ఎలా పెట్టారో , ఆవిడ కోడలి మాటల్లోని విని తెలుసుకోవాలి. భానుమతి గారు వాస్తవానికి "కోడలి కథలు " రాయాలి, కానీ సహజ స్వభావం గల అత్తగారి పాత్రను వాస్తవిక రూపం కల్పించి సున్నితమైన హాస్యాన్ని పంచారు. ఆవిడ సినిమా జీవితం గురించి రాయాలి అంటే ఒక పుస్తకం రాయొచ్చు. అత్తగారి కథలు రాసిన భానుమతి గారి అమ్మగారి పేరు "సరస్వతి". వాళ్ళ అమ్మగారి గురించి , "నిజంగానే సరస్వతి "అని ఒక వ్యాసం రాసారు. బహుశా ఆమె ఆత్మకథ అనదగ్గ "నాలో నేను" అనే పుస్తకంలో అనుకుంటాను. అవే మాటలు భానుమతి గారికి వర్తిస్తాయి. సరస్వతి గారి కుమార్తె భానుమతి గారు "నిజంగానే సరస్వతి". ఆమె నా అభిమాన గాయని. వినండి ఈ వారం కథ శ్రీమతి భానుమతి గారి రచన "అత్తగారూ-ఆవకాయ" 🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Assistant General Manager Indian Bank Vijayawada Mail ID : [email protected]
-
81
ఎందుకుపారేస్తాను నాన్నా ! కథ, రచయిత చాగంటి సోమయాజులు
ఎందుకుపారేస్తాను నాన్నా ! కథ, రచయిత చాగంటి సోమయాజులు
-
80
కీ. శే.దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి శతజయంతి సందర్భంగా వారి కవిత "గుండె కింద నవ్వు"...వారి కథ "నవ్వు"
💐💐 *కవి-కథకుడు కీ. శే.దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి శతజయంతి సందర్భంగా వారి కవిత "గుండె కింద నవ్వు"...వారి కథ "నవ్వు"* 💐💐 కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏 తిలక్ గారి "నవ్వు " కథ గురించి చెప్పాలి అంటే... తిలక్ గారి మాటల్లోనే చెప్పాలి ...ఒక వ్యక్తి జీవితాన్ని....జీవిత రహస్యాన్ని..... జీవిత వైచిత్రిని....జీవితంలోని అనిశ్చితత్వాన్ని.... కుతూహలంతో నింపి రాసిన కథ....నవ్వు. తిలక్ గారు దాదాపు 30 కి పైగా కథలు రాశారు. అన్ని కథల్లోనూ....మానవ జీవితాల్ని నియంత్రించే సామాజిక అంశాల్ని స్పష్టంగా తెలిసేలాగా , పాఠకుడికి అందేలాగా పాత్ర చిత్రణ, కథా గమనము , శైలి ఉంటాయి. ప్రస్తుత కథ "నవ్వు" లో...ప్రేమించిన యువతి పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి , తాను ప్రేమించింది చాలీ చాలని సంపాదన ఉన్న యువకుడిని అని తెలుసుకుని పెళ్లికి నో చెప్పడానికి "నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే కానీ నా జాగ్రత్తలో నేను ఉండాలిగా "అంటుంది.ఆ తరువాత కొంత కాలానికి అతడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడకపోయినా అతడిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంది అనేది కథలో గొప్పగా చిత్రించారు తిలక్... ఆయన కథలు "తిలక్ కథలు " పేరుతో సంకలనంగా వచ్చాయి. ఆయన నా అభిమాన రచయిత కనుక పరిచయ వాక్యాలు కథతో పాటే వినిపించాను. వినండి ఈ వారం కథ..."నవ్వు" రచయిత ....ఈరోజు మనం శతజయంతి జరుపుకుంటున్న కవికుల తిలకుడు...కీ. శే.దేవరకొండ బాలగంగాధర తిలక్.💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada Ph 96770 15158. Mail ID [email protected]
-
79
"వెన్నెల నీడ " రచన శ్రీ భ.రా.గో.(భమిడిపాటి రామ గోపాలం )
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ *" వెన్నెల నీడ " రచన శ్రీ భ.రా.గో.(భమిడిపాటి రామ గోపాలం )* శ్రీ భరాగో హాస్య రచయిత గా గుర్తింపు పొందినా... మనసులోతుల్ని స్పృశించే కథలు ఎన్నో రాశారు. అటువంటి గొప్ప కథల్లో కథే "వెన్నెల నీడ". మానవ జీవితంలో అనేక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధం అత్యంత సున్నితము...బలము అయినది. మొదలైన క్షణం నుంచి పరస్పర ప్రేమాభిమానాలు , అనురాగం నమ్మకం ప్రాతిపదికగా జీవిత పర్యంతమూ సాగేది. భరాగో గారి ఈ కథని ముళ్ళపూడి - బాపు గారు సినిమాగా తీద్దాము అనే కోరికతో ఉండేవారుట. వారు సినిమా తియ్యకపోయినా ఈ కథలో రచయిత వ్యక్తం చేసిన భావాల్ని వారి సినిమాలు ముత్యాల ముగ్గు మొదలుకుని ....పెళ్లి పుస్తకం దాకా చాలా వాటిలో భార్యా భర్తల అనుబంధానికి ఉండే విలువను ఎంత హృద్యంగా చెప్పవచ్చో అంత హృద్యంగానూ చెప్పారు. వారు సెల్యులాయిడ్ పై చూపిన విషయాన్ని భరాగో 1960 ప్రాంతాల్లోనే ఈ కథగా మలిచారు. ఈ కథకి పేరు ఉంచడంలోనే భరాగో గారి గొప్పదనం తెలుసుకోవచ్చు. మాములుగా వేరే ఏ రచయితో అయితే ఈ కథకి " తప్పిపోయిన పెళ్లి సంబంధం " అని ఒక పేలవమైన పేరు ఉంచేవాడు. భరాగో స్త్రీ మనో ఔన్నత్యానికి భంగం వాటిల్లకుండా "వెన్నెల నీడ " అన్నారు. కథలో శ్యామల ఆలోచనలు గతి తప్పడం రచయిత రాసారు, పాఠకులు చదువుతారు , ఆమె భర్త సూచన ప్రాయంగా గ్రహిస్తాడు , ఆమె తనని తాను నిందించుకుంటుంది. కానీ కథ ముగిసేసరికి ఆ భార్యా భర్తల మధ్య అనురాగ బంధం ఎంత బలీయమైనదో బయటినుంచి చూసిన మనకి స్పష్టమవుతుంది.... ఆ భార్యాభర్తలే కాదు ఏ భార్యాభర్తల మధ్య ఎటువంటి పొర పొచ్చాలు వచ్చిన "మనసు తెలుసుకుని " మసులుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన కథ..శ్రీ భరాగో గారి .."వెన్నెల నీడ ".వినండి ఈ వారం కథ....💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Ph 96770 15158 Mail [email protected]
-
78
"కాఫీ పెట్టవూ !" రచయిత్రి కిరణ్ విభావరి
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 🙏ఈ వారం మనం వినబోయే కథ "కాఫీ పెట్టవూ !" రచయిత్రి కిరణ్ విభావరి. నేను సాధారణంగా కథ చదివి వినిపించడానికి ఎంచుకునేటప్పుడు వర్ధమాన రచయిత లేదా ప్రఖ్యాత రచయిత కథ అయినా కథలో కదిలించే గుణం ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాను. ఆవిధంగా "కాఫీ పెట్టవూ " కథ నన్నే కాదు...వాట్సాప్ లో చదివినప్పుడు చాలా మందిని కదిలించింది. గతంలో నేను వినిపించిన , ప్రభాకర్ జైని గారి "సర్దుకున్నారా !" కథ లాగా ! కిరణ్ విభావరి సాహిత్య వనంలో ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతున్న యువ రచయిత్రి. ఆమె సాహిత్యప్రయాణం సెప్టెంబర్ 2019 లో ప్రారంభించారు...ఇంకా ఏడాది కూడా కాలేదు. ఒక 30 కథల వరకూ రాశారు. కథ గురించి ప్రత్యేకించి చెప్పాలి అంటే తేలిక భాషలో రాసిన బరువైన కథ. ప్రధాన పాత్రల్లో ముగ్గురూ మంచి మనస్తత్వం ఉన్నవారు. కథ ముగించాక మనసుకి బాధ కలిగినా ఎవరినీ తప్పు ఎంచలేము. ఈ కథ లో రచయిత్రి.......మధ్య తరగతి కుటుంబాల్లో మనుషుల్లోని గుండె మూలల్లో ( గుండె లోతుల్లో కాదు ) దాగి ఉండే బాధ్యతల బరువు... ప్రేమ...స్వార్థం ఒక్కో నిముషంలో ఒక్కోటిగా చూపిస్తూ అంతా పావుగంటలో హ్యూమన్ సైకాలజీని మన ముందు పరిచారు . రచయిత్రి సైకాలజీ విద్యార్థిని కనుక పర్ఫెక్ట్ గా ఒక సామాన్య విషయాన్ని మనసుని కదిలించేలాగా ఆవిష్కరించగలిగారు అని భావిస్తున్నాను. వినండి ఈ వారం కథ "కాఫీ పెట్టవూ "💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada Ph 96770 15158 Mail ID [email protected]
-
77
"బుద్బుదం" రావి శాస్త్రి గారి రచన
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ "బుద్బుదం "....రచయిత రావి శాస్త్రిగా ప్రసిద్ధి చెందిన కీ. శే.రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహా రచయిత. మానవ జీవితంలోని కష్టాలను చాలా స్పష్టంగా చూపిస్తూ రచనలు చేసిన ప్రజల రచయిత రావి శాస్త్రి గారు. ఆయన రచనలు సాహిత్య సృష్టి కోసం చెయ్యలేదు. శ్రీ శ్రీ కవిత్వంలోని పతితులు , భ్రష్టులు, బాధా సర్పదష్టుల్ని ...వారి జీవితాల్ని తన కథాంశాలుగా చేసుకుని వారి బాధల్ని లోకం దృష్టికి తీసుకు వెళ్ళడానికి మాత్రమే రచనలు చేసిన నిజమైన న్యాయవాది. వృత్తి...ప్రవృత్తి కూడా న్యాయం కోసం...ధర్మం కోసం ప్రజాపక్షం వహించి పోరాడడమే ఆయన లక్ష్యం. ఆయన రచనా శైలి గమనిస్తే....ఉపమానాలు అమితంగా కనపడతాయి.అందువల్లే శ్రీ రమణ గారు ఆయన్ని "ఉపమా రాచకొండస్య " అని చమత్కరించారు. వారి ఇతర రచనలు కథల్లో....ఋక్కులు, ఆరు సారా కథలు , ఆరు సారో కథలు, బాకీ కథలు. నవలలు అల్పజీవి , రాజు-మహిషి , రత్తాలు రాంబాబు , గోవులొస్తున్నాయి జాగ్రత్త....మరి కొన్ని. విశాఖ సాగర తీరంలో వారి విగ్రహాన్ని ఉదయపు నడకలో అనేకమార్లు సందర్శించుకుని నమస్కరించుకున్న అదృష్టం నాది. ప్రతి ఏడాది వారి కుటుంబ సభ్యులు , వారి జూనియర్స్ వారి పుట్టినరోజు జులై 30 న బీచ్ రోడ్డులోని వారి విగ్రహం వద్ద నిర్వహిస్తారు. రావిశాస్త్రి రచనా పురస్కారం అందజేస్తారు. 2019 లో శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారికి రావిశాస్త్రి గారి రచనా పురస్కారం లభించినప్పుడు ఆ సభలో వారి కుమారుడు శ్రీ ఉమా కుమారశాస్త్రి గారు ఇతర కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశం కలిగింది. చివరిగా రచయితగా ఆయన లక్ష్యమూ , దృక్పధమూ ఆయన మాటల్లోనే చెప్పి ముగిస్తాను. *"రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించ వలసిన అవసరం ఉందని నేను భావిస్తాను "* అంటారు. 💐💐వినండి ఈ వారం కథ "బుద్బుదం" రావి శాస్త్రి గారి రచన. 🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada Ph 96770 15158 Mail [email protected]
-
76
"మూలాధార చక్రం " రచయిత కీర్తి శేషులు.. శ్రీ వీరపల్లె వీణావాణి
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.🙏. ఈ వారం మనం వినబోయే కథ "మూలాధార చక్రం " రచయిత కీర్తి శేషులు.. శ్రీ వీరపల్లె వీణావాణి .ఆయన ఇంటిపేరు వీరపల్లె ....వీణావాణి ఆయన కలం పేరు. అసలు పేరు ఆంజనేయులు నాయుడు. 1981 లో నేను చిత్తూరు జిల్లాలో శ్రీ వేంకటేశ్వర గ్రామీణబ్యాంక్ లో పనిచేసినప్పుడు... నాకు నాలుగు దశాబ్దాలక్రితం మంచి స్నేహితుడు. నన్ను తెలుగు సాహిత్యంలో పి.జి. చెయ్యాలి అని ప్రోత్సహించి....లింగ్విస్టిక్స్ (భాషాశాస్త్రం) బోధించి , నోట్స్ రాసిపెట్టిన నేస్తం. ఉద్యోగ రీత్యా 1994 -98 మధ్య కాలంలో నేను ఆంధ్రదేశం విడిచిపెట్టిన సమయంలో మా స్నేహం కొనసాగించ లేకపోయాను. ఆయన కావలి ,జవహర్ భారతి కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. డాక్టర్ పి.కేశవరెడ్డి నవలల పై ప్రొఫెసర్ గైడెన్స్ లేకుండా శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ సాధించిన ప్రతిభాశాలి. నాటక రచయిత. అకాల మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా గ్రామీణ యాసలో సరదాగా మాట్లాడేవారు. ఈ కథ ఎంచుకోడాని రచయిత నా మిత్రుడు కావడం కారణం కానే కాదు. కథలో భూమి గురించి....నేల గురించి...మట్టి గురించి....గొప్ప వాక్యాలు ఉన్నాయి. మట్టితో మనిషికి గల అనుబంధాన్ని మనసు స్పందించేలా చెప్పారు. 25 నిముషాల కథలో ప్రతి అయిదు నిముషాలకు ఒక అద్బుతమైన పంక్తి చదివేటప్పుడు మనసుకి సోకి మనల్ని కదిలిస్తుంది. ఒక కుమ్మరి మట్టి పిసికినా....ఒక రైతు నేల దున్నినా....అది వట్టి మట్టి కాదు...వట్టి నేల కాదు....మట్టికి రూపు దిద్దే ప్రయత్నం ఒకరిది... నేల నించి ప్రాణాన్ని , జీవాన్ని పైకి తీసే ప్రయత్నం ఒకరిది. మట్టి మనిషికి జీవనాధారం.పొలం పట్ల ఉండే మమకారం , నేల మీద నమ్మకం కథలో గొప్పగా చిత్రించారు రచయిత.వినండి ఈ వారం కథ "మూలాధార చక్రం ". కీ. శే. వీరపల్లె వీణావాణి రచన. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada Ph 96770 15158 Mail ID [email protected]
-
75
మా బావమరిది పెళ్లి ...రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు.
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏ఈ వారం మనం వినబోయే కథ... *మా బావమరిది పెళ్లి ...రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు.* ఏ రచయిత అయినా తన రచనల ద్వారా శాశ్వతత్వం పొందుతారు అనేది నిర్వివాదాంశం. అయితే కొందరు రచయితలు వారి రచనల్లో పాత్రలకు సజీవ రూపం కల్పించి ఆ పాత్రలకు కూడా శాశ్వతత్వం చేకూరుస్తారు. అటువంటి రచన శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిష్టరు పార్వతీశం. తెలుగు సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ సుపరిచిత మైన వ్యక్తి బారిష్టరు పార్వతీశం. నేను వ్యక్తి అనే పేర్కొంటున్నాను.పాత్ర అనటం లేదు. ఎందుచేత అంటే బారిష్టరు పార్వతీశం అందరివాడు....ముళ్ళపూడి వారి బుడుగు లాగా ! బుడుగుది గడుసుదనం. పార్వతీశంది అమాయకత్వం. అన్నట్టు రేపు (28 జూన్) బుడుగు వాళ్ళ నాన్న (రవణ గారి) పుట్టినరోజు. సరే తిరిగి కథలోకి వస్తే....మా బావమరిది పెళ్లి... ఒక అరవై ఏళ్ల క్రితం తెలుగు కుటుంబాల్లో సంప్రదాయ పద్దతిలో ఐదురోజుల పెళ్లిళ్లు ఎలా జరిగేవో హాస్య భరితంగా రాసిన కథ. పెళ్లికి తరలి వెళ్లే హడావిడి......చుట్టాలు సందడి...మేజువాణీ వేడుకలు...అన్నీ ముగిశాక అలసి కొంపకు చేరుకోడం...తనదైన శైలిలో రాశారు మొక్కపాటి వారు. మొక్కపాటి వారిది సహజమైన హాస్యం. సంఘటనా ప్రధానంగా రచనలో హాస్యం తొణికిసలాడుతుంది...ఏడాది రెండేళ్ల క్రితం తెలుగులో అయిదు రోజుల పెళ్లి మీద ఒకటో రెండో సినిమాలు కూడా వచ్చిన గుర్తు. రెండేళ్లు గడిచేసరికి కాలం ఎలా మారిపోయిందో చూడండి పట్టుమని పాతికమంది కూడా లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాల్సిన కరోనా కాలం వచ్చింది. గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని నిట్టూరుస్తూ..... అయిదు రోజుల పెళ్లి అయిదు నిముషాల్లో ముగించాల్సి వస్తోంది. సరదాగా....వినండి ఈ వారం కథ..."మా బావమరిది పెళ్ళి " మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి రచన. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada PH 96770 15158 Mail [email protected]
-
74
"పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన "రచయిత శ్రీ P.V. సునీల్ కుమార్ IPS
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 🙏 *ఈ వారం మనం వినబోయే కథ "పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన "రచయిత శ్రీ P.V. సునీల్ కుమార్ IPS, Addl. DGP Chief of CID* సునీల్ కుమార్ గారి ఈ కథ వారి కథాసంకలనం " నీలవేణి " నుండి తీసుకున్నాను. ఆ కథాసంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి.కథాంశం పరంగా వేటికి అవే భిన్నమయినవి. అయితే ఆ కథలు అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉండేది వ్యంగ్యం (satire). సునీల్ కుమార్ గారి రచనాశైలి ఆయన కథలు చదువుతుంటే మన కళ్ళని వాక్యాలు...పదాల వెంట పరుగులు తీయిస్తుంది. నీలవేణి కథాసంకలనానికి రచయిత నా మాట అంటూ...రాసిన చిన్నపాటి ఇంట్రోలో...రచనకు వినోదం , సామాజిక బాధ్యత రెండు అంచులు. వినోదం అందిస్తూనే విషయం చెప్పడం మంచిది అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని గురువుగా భావిస్తాను అని చెప్తూ...వారి కథ "ఇలాంటి తవ్వాయి వస్తే" కథను ప్రస్తావిస్తూ...కుల వివక్షను గుర్తించి ,ఆయన చిత్రించిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. సునీల్ కుమార్ గారినీలవేణి... కథాసంపుటానికి ప్రఖ్యాత కవి , రచయిత శ్రీ పాపినేని శివశంకర్ ముందు మాట రాశారు. మనం ఇప్పుడు వినబోయే కథ గురించి శ్రీ శివశంకర్ ప్రస్తావిస్తూ..."ఆదిలో వాక్యముండెను" అని కొంతమందికి తెలుసేమో. చర్చిలో ఏముండును చాలామందికి తెలియదు.ఆదివారం చర్చి వాతావరణం , అక్కడికి వచ్చే మనుషుల బాహ్యంతర వాతావరణం "పరిశుద్ధ వివాహము:మూడవ ప్రకటనలో " పాఠకులకి తెలుస్తుంది.శ్రమదినాలు, పుట్టు క్రైస్తవులు , దైవజనులు , మూడవ ప్రకటన , ప్రార్థనలో పెట్టడం ....ఇటువంటి సంగతులు అన్నీ తెలుస్తాయి. అంతకుమించి - క్రైస్తవులు అందరూ ఒకటే ...ఒకటే బైబిలు....ఒకటే దేవుడు...కానీ పెళ్లిదగ్గర కాదు గదా ! అంటాడు గోవులాంటి అబెదనగొ....దేవునిముందు అందరూ సమానులే అని తెలిసినవాడు. కానీ కూతురి పెళ్లి సంబంధం విషయానికి వచ్చేసరికి కమ్మ కన్వర్టెడ్ క్రిస్టియన్ గా తాను ఎక్కువ సమానుడినని , మాల మాదిగలు తక్కువ సమానులని తేల్చి చెప్పాడు. ఈ పుట్టు క్రైస్తవుల మధ్య పెట్టు క్రైస్తవుల లోగుట్టు బయటపెట్టి....వాళ్ళకి "సాహిత్య ప్రమాదం " తెచ్చిపెట్టాడు అంటారు. నా కొద్దిపాటి జీవితానుభవంలో నేను తెలుసుకున్నది ఒక్కటే....ప్రస్తుత సమాజంలో ఉన్నవి రెండే కులాలు...డబ్బు+అధికారం...ఉన్నవాడు- లేనివాడు." ఈ రెండూ అన్ని అంతరాలనూ... అభ్యంతరాలనూ తొలగిస్తాయి. ఇదే ప్రాతిపదికగా సమాజం నడుస్తోంది. వినండి ఈ వారం కథ P V సునీల్ కుమార్ గారి రచన "పరిశుద్ధ వివాహము:మూడవ ప్రకటన "💐💐🙏కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada Phone 96770 15158 Mail [email protected]
-
73
కీ. శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "డు.. ము..వు..లు
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏💐💐ఈ వారం మనం వినబోయే కథ కీ. శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "డు.. ము..వు..లు ".ఈ నాలుగు అక్షరాలు విడి విడిగా చదవగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది....తెలుగు వ్యాకరణం లోని... విభక్తి ప్రత్యయాలు...వాటిలోని ప్రథమావిభక్తి . చిన్నప్పుడు అర్థం అయినా కాకపోయినా బట్టి పట్టిన అంశాల్లో విభక్తి ప్రత్యయాలు ఒకటి. వారం వారం కథకి పరిచయ వాక్యాలు రాస్తూ కృష్ణాతీరం నుండి కథాభిమానులకి....అంటూ మొదలెట్టే నాకు....మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చిన్న నవల "కృష్ణాతీరం " గతవారం చేతికి వచ్చింది. అందులోని కథా...కథనమూ....భాషా...శైలి చదివి గత వారం రోజులుగా పులకరించిపోతున్నాను. అందువల్ల ...ఈ వారం ఆయన రాసిన కథల్లోంచి ఒకటి ఎంచుకుని చదవాలి అనిపించి....ఈ కథ ఎంచుకున్నాను. రామకృష్ణశాస్ట్రీ గారిది....అచ్చతెనుగు పలుకుబడి.జాను తెనుగు.ఈ కథ ఆంధ్ర మహాభారత రచనకు సంబంధించి చారిత్రక నేపధ్యంసృష్టించి అల్లిన కథ. కవి బ్రహ్మ తిక్కన సోమయాజి శాస్త్రిగారికి అభిమాన కవి. ఈ కథలో భారతాన్ని ఆంధ్రీకరించిన తిక్కన గారితో వారి సోదరుడు గురునాథుడు "ఒక్కరి కూటికీ గుడ్డకూ...అక్కరకొచ్చేది మీ బాస-మందిలో పడేది మా బాస "అంటాడు. ఈ కథలో శాస్త్రి గారు...సాహిత్యంలోనూ ..సంగీతంలో.....జాతి సంస్కృతి లో..రెండు మార్గాలుగా సాగే...శిష్ట -దేశి మార్గాలను రెండింటినీ సమన్వయ పరచుకొని సాగాలి అనే ఆలోచనతో ఈ కథ రాసినట్లు అనిపిస్తుంది. ఆయనది ఏ ప్రాంతపు మాండలికమూ కాదు. కేవలం తెలుగు. అచ్చ తెనుగు.చదివి వినిపించడానికి ...పలుకులకి లొంగే తెలుగు కాదు.అందువల్ల ఆయన జానుతనం తక్కువ ఉన్న కథ ఎంచుకున్నాను. వారి కథ...నవల...వ్యాసం ఏ వచన రచన చదివినా ...బాపూ రమణలు వారి కార్ట్యూనులు లో చెప్పినట్టు "ఓహో ! వచన రచనకు మేస్త్రి ! సాహా ! రామకృష్ణ శాస్త్రి ! "అనిపించక తప్పదు. నాలుగు రోజుల్లో ఈ నెల 17 వ తేదీ వారి జన్మదినం. వారికి మనః పూర్వకంగా నమస్సులు అర్పిస్తూ...ఈ వారం కథ "డు..ము..వు..లు." వినండి. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Phone 96770 15158. Mail [email protected]
-
72
"చిట్ట చివరి సున్నా " రచయిత శ్రీ భగవంతం
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏. ఈ వారం మనం వినబోయే కథ "చిట్ట చివరి సున్నా " రచయిత శ్రీ భగవంతం. రచయిత శ్రీ భగవంతం అసలుపేరు నరసింహారావు. భగవంతం కలం పేరు. ప్రత్యేకించి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే...ఈ రచయిత తన కలంపేరుని వేరొక ప్రసిద్ధ రచయిత రాసిన కథలోని పేరుని తన కలం పేరుగా పెట్టుకున్నారు.ఆ ప్రసిద్ధ రచయిత శ్రీ త్రిపుర. ఆయన కథల్లో "భగవంతం కోసం " అనేది గొప్ప కథ. ఒక రచయిత వేరొక రచయితని ఏ మేరకు influence చేస్తాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. శ్రీ భగవంతం కవి, కథారచయిత. చిట్టచివరి సున్నా...కథ పరిశీలిస్తే ఒక ఆలోచనా శీలి అయిన వ్యక్తి మనకు కథలో దర్శనమిస్తాడు.అది రచయితే ! మనసు లోతుల్లోకి అన్వేషణ కథలో అంశం. ఆ అన్వేషణ బాహ్యప్రపంచానికి పైకి సరదాగా కనిపించినా అందులో లోతైన ఆలోచన ఉన్నది. ఒక హోటల్ సర్వర్ ని తాత్వికుడు అని పేర్కొనడం వెనుక అర్థం...అతడి జీవితంలోని విషాదాన్ని మనముందు పరిచేముందు...అతడిని ఆ విధంగా పరిచయం చేస్తాడు. మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని....తను వెతికి చూపించినట్టు కథను సృష్టించి , మనకి గ్రహింపుకి తీసుకువస్తాడు...రచయిత. వర్తమానంలో మనం చేసే పనులు మనకి ఆనందాన్ని ఇస్తాయా.... దుఃఖ హేతువులు అవుతాయా అన్నది ఒక తెలియని వెతుకులాట అని మనకి తెలియచేస్తారు ఈ కథలో రచయిత. ఈ కథ పై మీ అభిప్రాయాన్ని రచయిత ఫోన్ నెంబర్ 93993 28997 కి గానీ నాకు గానీ తెలియచేయండి. వినండి ఈ వారం కథ "చిట్ట చివరి సున్నా " శ్రీ భగవంతం రచన. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Ph 96770 15158 Mail [email protected]
-
71
"ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ "ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు. తెలుగు సాహిత్యంలో ఒక ఉప్పెన. భావాలకు మాత్రమే కాదు...భాష విషయంలో కూడా ! ప్రత్యేకించి భాష గురించి ఎందుకు చెప్తున్నాను అంటే..."ఓ పువ్వు పూసింది " కథ కాదు....కథలాంటి కవిత. భాషలోను భావంలోను కూడా కవితాత్మకత నిండిన కథ. చలంగారి కథ చదివి వినిపించాలి అని ఉన్నా....దాపరికం లేకుండా చెప్తున్నాను....ధైర్యం చాల్లేదు. వరుసపెట్టి ఆయనవి ఒక యాభై కథలు తిరగేసాను. ఏదీ వినిపించలేను అనిపించింది...చదివి వినిపించడానికి స్వరంలో ఒదిగే శైలి, భాషా...భావాలు కావు ఆ కథల్లో ఉన్న విషయాలు.కానీ విస్మరించ వీలు లేని...వీలు కానీ రచయిత. ఆయన అత్యంత సుప్రసిద్ధమైన ఈ కథ ఎంచుకుంటే అన్ని రకాల ఇబ్బందులూ తొలిగిపోతాయి అనిపించింది. పైగా ఆయన పుట్టినది... మరణించింది మే మాసం.(జననం మే 19 వ తేదీ... మరణం మే 4 వ తేదీ ) కాబట్టి నివాళిగా ఉంటుంది అని నిర్ణయించుకున్నాను. ఓ పువ్వు పూసింది ప్రతీకాత్మక కథ. స్త్రీ ని ప్రకృతితో పోలుస్తూ.... తిరిగి ప్రకృతిలోని పుష్పాన్ని ఆమెకు ప్రతిరూపంగా చూపిస్తూ...స్త్రీ భావాలు...ఆలోచనలు....అనుభవాలు....అనుభూతులూ....మేళవించి రాసిన కథ. తనికెళ్ళ భరణి గారు అన్నట్టు...ఆడపిల్ల ఆవిర్భావం నుంచి అంతర్థానం వరకూ సంపూర్ణ స్త్రీత్వాన్ని పరిశీలించి , పరామర్శించి , వివరించి , విపులీకరించి , కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తాడు చలం. ఓ పువ్వు పూసింది కథ చదివితే చదివినట్టుండదు. జీవన మాధుర్యం గుండెల్లో పూసినట్టుంటుంది. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీ అయితే....గుడిపాటి వెంకట చలం స్త్రీ స్త్రీ.... వినండి ఈ వారం కథ "ఓ పువ్వు పూసింది "రచయిత చలం. 🙏కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail [email protected]
-
70
కవి అఫ్సర్ కథ "ముస్తఫామరణం "
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏కాలాలు, ఋతువుల్ని బట్టి నిర్ణయం జరిగి , వాతావరణం లోని మార్పులకి అనుగుణంగా....వర్షాకాలం, శీతాకాలం , వేసవికాలం అని పిలుచుకుంటున్నట్టు....కొత్తగా కరోనా కాలం ...ఒక ఋతువు ఎంత కాలం ఉంటుందో అంతకాలమూ ఉండేలా ఉన్నది. గ్రీష్మతాపం ఎక్కువ అయ్యింది. అందరూ ఇళ్లకు పరిమితం అయి క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను.తెలుగు సాహిత్యంలో ...ముఖ్యంగా కథా సాహిత్యంలో సమాజంలోని అన్ని మతాల, కులాల ప్రజల జీవితాల్ని స్పృశిస్తూ అనేక కథలు వచ్చాయి. స్త్రీవాద సాహిత్యం ,దళిత కథలు , ముస్లిం కథలు.... ఇలా వర్గీకరణ చేసి చెప్పచ్చు. కానీ ఈ వర్గీకరణలు కేవలం కథలలో చిత్రించిన జీవన నేపధ్యాలకే కానీ....అభిప్రాయ భేదాలు....వేర్పాటులు కాదు. *ఈ వారం మనం వినబోయే కథ "ముస్తఫామరణం"రచయిత కవి అఫ్సర్* ఈ కథలో కవి అఫ్సర్ ఆధ్యాత్మికత గురించి మంచి విశ్లేషణ చేశారు. జీవిత యుద్ధం చెయ్యలేని వాళ్ళకి ఆధ్యాత్మికత ఒక మారు గుమ్మం (Outlet ) అవుతుంది అనీ, అందులోని మార్మికత ఒక డొల్ల అని చెప్తుంది ఈ కథ (2012).కుటుంబ బరువు బాధ్యత వహించవలసిన కుటుంబ పెద్ద భక్తిలో మునిగి , వేదాంత ధోరణిలో పడిపోతే ఆ కుటుంబానికి ఎంత కష్టం. దేముడి పట్ల నమ్మకం , మతం పట్ల విశ్వాసం తప్పనిసరిగా అవసరం అని చెపుతూనే....అవే జీవితం అయితే తన మీద ఆధారపడి న మిగతా కుటుంబం మాట ఏమిటి? అని ప్రశ్నిస్తాడు రచయిత. తీవ్రమైన భక్తి మనిషికి మరణానికి అతీతమైన దైవత్వాన్ని , శాశ్వతత్వాన్ని, సిధింప చేస్తుందా అంటే కాదు...లేదు అని స్పష్టం చేస్తుంది ఈ కథ. కేవలం ముస్లిం మతానికే కాదు ఈ ఆలోచనా సూత్రం అన్ని మతాలకు సమంగా వర్తిస్తుంది. వినండి కవి అఫ్సర్ కథ "ముస్తఫామరణం "(రచయిత అమెరికాలోని ఫిలడేల్ఫీయా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ వారి వాట్సాప్ నెంబర్ +1 (512) 743-4593 ) 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail [email protected]
-
69
వేటూరి వారి వర్థంతి
💐💐ఈరోజు 22nd May 2020 వేటూరి వారి వర్థంతి.🙏 ఉదయం నించి ఏ వాట్సఆప్ గ్రూపు తెరిచినా వారి గురించిన విశేషాలు....జ్ఞాపకాలు....మాటలు....వారి పాటలు. వేటూరి వారిని ఎవరం అయినా సినిమా కవిగానే గుర్తుంచుకుంటాము.కాదనను. కానీ ఆయన సినీ గీతరచనకు గొప్పతనం చేకూర్చింది ....ఆయన పాండిత్యం. ఆయన పత్రికా రచనలో ....జర్నలిస్ట్ గా గడించిన అనుభవం ఆయన్ని ఏ సన్నివేశానికి అయినా (వార్తకు తక్షణం స్పందించడం పత్రికా రంగంలో ...మీడియాలో ఉన్నవాళ్ళకి అత్యవసర లక్షణం ) వెంటనే పాట రాయగలిగేలా చేశాయి అనిపిస్తుంది. ప్రతిఘటన చిత్రంలో ఆయన "దుర్యోధన దుశ్శాసన....లోకంలో " పాట ఆయనలోని జర్నలిస్ట్ కవి....మనకి కనిపించేలా చేస్తుంది.ఆయన పాండిత్యానికి ఉదాహరణగా చెప్పాలి అంటే పదులకొద్ది పాటలను ఉదహరించాలి . భక్త కన్నప్ప సినిమాలో కిరతార్జునీయం పాట విషయానికి వస్తే....శ్రీనాధుని హరవిలాసం కావ్యంలోని " వికట పాటల జటా మకుటికా భారంబు .....కరుకైన జుంజురు నెరులు గాగ...." పద్యపాదాన్ని గుర్తుకుతెచ్చేలా .....నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే....తలపైన గంగమ్మ తలపులోనికి జారే.... అని రాసుకువచ్చారు. ఆయన మాటల్లో ఆయనే అన్నారు...".గతమంతా శ్రుతం నాది....ప్రస్తుతానికి అదే పునాది."...అని. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యాన్ని సృజిస్తూ....మానస వీణా మధుగీతం వంటి గొప్ప పాటలు రాసారు. పంతులమ్మ చిత్రంలోని పాటల గురించి ప్రస్తావిస్తూ....1980 లో తెనాలిలో శంకరాభరణం సినిమా యూనిట్ అభినందన సభలో ఆయన ఒక ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. శంకరాభరణం సినిమాలోని పాటలను ప్రశంసిస్తూ తెనాలికి చెందిన ఒక ప్రముఖ వైద్యులు...పొరపాటున.... బూతు పాటలు రాసిన వేటూరి గారేనా ఈ పాటలు రాసినది అని ఆశ్చర్యం కలిగింది అని నోరు జారారు. వేదిక మీద ఉన్న వేటూరి...బెబ్బులి లాగా లేచి ఏది బూతు...ఏది నీతి.. ఏది కవిత్వం...ఏది సాహిత్యం...ఏది జనహితం....ఏది జానపదం అంటూ ఒక పదిహేను నిముషాలు అద్భుతంగా తన పాండిత్యాన్ని...లోకం ఏవిధంగా గుర్తించలేదో.... సినిమా కవిగా మారిన తరువాత తనకు ప్రజలు ఏ విధంగా నీరాజనాలు పడుతున్నారో చెప్తూ....పంతులమ్మ సినిమాకి పాటలు రాసిన దౌర్భగుడ్ని నేనే అని బాధపడ్డారు. ఎడారిలో కోయిల అన్న పదంలోని....భావాన్ని చెప్పమన్నారు. ఆతరువాత ఆయన మేఘసందేశంలో అటువంటి పద ప్రయోగాలు ఎన్నో చేశారు....ఒక పాటలో...వానకారు కోయిల....రాతి పూల తుమ్మెద వంటివి.వేటూరి వారి గురించి చెప్పాలి అంటే ఒక వాట్సాప్ మెసేజ్ ఒక వ్యాసం సరి పోవు.ఆయన కవి సమ్రాట్ విశ్వనాథ వారి శిష్యుడు.వారి పెదతండ్రిగారి నించి వారికి సంక్రమించిన పాండిత్యం....మహాకవి కాళిదాసు కుమారసంభవ కావ్యంలోని ...జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ....అనే శ్లోకాన్ని....పార్వతీప...రమేశ్వరౌ.....అని వాక్కుని అర్థాన్ని కొత్తప్రయోగంగా మార్చి.....లోకానికి తండ్రులు ఈశ్వరుడు...విష్ణువు అని చమత్కారంగా వాడే ధైర్యమున్న కవిగా మలిచాయి. వేటూరి...బాగా చదువుకున్న పండితులు.లోకాన్ని చదివిన విలేఖరి.... ఆ తదుపరి సినీ గేయ ప్రవాహం. 💐💐వారికి నివాళి 🙏కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Ph 96770 15158. వారిని గురించి..... శ్రీ తనికెళ్ళ భరణి ...నక్షత్ర దర్శనం ....పుస్తకంలో రాసిన పద చిత్రం ....సహస్ర శీర్ష బ్రహ్మ వేటూరి సుందర రామమూర్తి ....ఆడియో రూపంలో మీకు అందిస్తున్నాను.
-
68
"రావులయ్య " రచయిత కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏 *ఈ వారం మనం వినబోయే కథ "రావులయ్య " రచయిత కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు* శ్రీపాదవారు ఎన్నో ప్రసిద్ధమైన కథలు రాశారు. వాటిలో సుప్రసిద్ధమైన ఆరేడు కథల పేర్లు చెప్తాను.1.గులాబీ అత్తరు.2.తాపీ మేస్త్రి రామదీక్షితులు BA 3 కలుపు మొక్కలు 4 అరికాళ్ళ కింద మంటలు 5 ఇలాంటి తవ్వాయి వస్తే 6 పుల్లంపేట జరీ చీర. ఇవికాక వారి "అనుభవాలు...జ్ఞాపకాలునూ ప్రతి తెలుగు భాషాభిమాని చదివితీరాల్సిన పుస్తకం. వారి కథలు పెద్దవిగా ఉంటాయి.పాత్రలు సంభాషించుకుంటూ పోతాయి....పాత్రల నోటి నుండి అచ్చతెనుగు మాటలు మేలిమి ముత్యాల కుప్పలుకింద పోగుపడతాయి. "శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు చదవడం కోసం అయినా తెలుగువాడిగా పుట్టాలి " అని ఎవరో అన్న మాట అక్షరాలా నిజం. ఇక ప్రస్తుత కథ " రావులయ్య " విషయానికి వస్తే....కథ పేరు గమనించండి....ఆయన రాములయ్య అని పెట్టలేదు...."రావులయ్య " అన్నారు. వ్యావహారిక భాషా ఉద్యమానికి కృషి చేసిన గిడుగు, గురజాడలకు అండదండగా ఉండేలా కథల్లో పూర్తి వాడుక భాషను ఉపయోగిస్తూ రచనలు చేశారు. నామ వాచకాలను పలకడంలో కూడా స్థానికమైన పలుకుబడిని ప్రవేశపెట్టారు. పైన ముందుగా ఉదహరించిన వారి ప్రసిద్ధ కథలను వదిలేసి "రావులయ్య " ని ఎంచుకోవడానికి కారణం......ఇది ఒక కృషీవలుడి కథ.....జీతగాడుగా జీవితాన్ని ప్రారంభించి...కౌలుదారుడుగా....రైతుగా....భూస్వామిగా ఎదిగిన రావులయ్య కథ..... కృషి...పట్టుదల...ముందు చూపు మనిషి అన్ని విధాలా ఎదగడానికి ఎంత అవసరమో తెలియచెప్పే కథ.నిరాశలో మునిగిపోయి ఉన్న నేటి రైతాంగానికి కొద్దిపాటి ఓదార్పు ఇచ్చే గత కాలపు గాథ. కమత గాడు....సేద్యగాడుగా మారి విజయం సాధించిన కథ. సౌహార్థభివ్యక్తితో చేసిన రచన. వినండి *ఈ వారం కథ "రావులయ్య " శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన*.💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail kopparthykathavahini@gmail. com
-
67
కళింగ ఆంధ్ర వారసుడు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు కథ "దాలప్ప తీర్థం.
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏కరోనా లాక్డౌన్ రెండు వారాలు అనుకున్నది, రెండు నెలలకు చేరువ అవుతున్నది. ఒక మహమ్మారిపై ఓపికగా పోరాడుతున్న భారత ప్రజానీకాన్ని , కష్టకాలంలో వారికి అత్యవసర సేవలు అందిస్తున్నవారిని అభినందించాలి. మంచిరోజులు రానున్నాయి అని అందరం ఆశగా ఎదురుచూద్దాము. గత వారం ఉత్తరాంధ్ర మహాకవులు గురజాడ , శ్రీ శ్రీ గార్ల కథలు వినిపించాను. వారిని మాట వరసకు ఉత్తరాంధ్ర కవులు అనడమే కానీ వారిద్దరూ ఆధునిక తెలుగు సాహిత్యానికి దారి చూపించి, వెలుగులు నింపినవారు. అదే ప్రాంతంలోంచి ....భాషా పరంగా....భావ పరంగా...ఒక powerful రచయిత ఉన్నారు. ఆయన పేరు *డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు. ఈవారం మనం వినబోయే కథ వారి "దాలప్ప తీర్థం "* ఉత్తరాంధ్ర లో పుట్టి పెరిగి అక్కడి భాషని , యాసని శ్వాసగా నిలుపుకొన్న రచయిత. రావిశాస్త్రి గారికి వారసుడా... అనిపించేలా తొలి నాళ్ళలో రచనలు చేసినా , ఆయన ప్రభావంనుండి బయటపడి , సొంత గొంతుక వెతుక్కున్న ప్రతిభావంతుడైన రచయిత.వృత్తిరీత్యా జర్నలిస్ట్... మంచి కథా రచయిత. కళింగ ఆంధ్ర మాండలికానికి పట్టం కట్టిన వ్యక్తి.పాత్రికేయునిగా పని చేస్తూనే తను పుట్టిన నేలను ప్రేమిస్తూ అక్కడి మట్టి వాసనను... రచనల్లో గుబాళింప చేస్తున్న రచయిత. ప్రస్తుత కథ " దాలప్ప తీర్థం " విషయానికి వస్తే....అతి హేయమైన పాకీ పనివారి దుఃఖ భరితమైన జీవితాల్ని మన దృష్టికి ఒక మీడియా పర్సన్ లా కాకుండా..., శక్తివంతమైన కథకుడిగా మారి హృదయాలు ద్రవించేలా చెప్పిన కథ దాలప్ప తీర్థం. ఈ కథకు బాపూ గారు చిత్రించిన బొమ్మను చూస్తే....శ్రీ శ్రీ మహాప్రస్థాన గీతాలకు ఆయన వేసిన చిత్రాలు గుర్తొస్తాయి. రచయిత శ్రీనివాసరావు గారు విశాఖలో ఉండగా నాకు పరిచయం. వారి కథా సంపుటాలు మూడు 1. దాలప్ప తీర్థం 2. కాన్పుల దిబ్బ 3. కప్ప స్థంభం ఉన్నాయి. చిత్రంగా ఆ మూడింటిని ఆయన వరుసగా 1 శ్రీ చెరువు రామకోటయ్య 2 డాక్టర్ పైడి వెంకట రమణ మూర్తి 3 శ్రీ వి. హర్ష వర్ధన్ గార్లకు అంకితం ఇచ్చారు. ఈ ముగ్గురూ కూడా నాకు ఆత్మీయ మిత్రులు కావడం నాకు గొప్ప ఆనందం .వినండి... *కళింగ ఆంధ్ర వారసుడు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు కథ "దాలప్ప తీర్థం." (రచయిత ఫోన్ నెంబర్ +91 88971 47067 )* 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada Phone 96770 15158 Mail [email protected]
-
66
గురజాడ వారి దిద్దుబాటు & శ్రీ శ్రీ గారి....అశ్వమేథయాగం
💐💐 *కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం* అందరూ ఇళ్లకు పరిమితమై....కరోనా విషయంలో జాగ్రత్త వహిస్తూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. *ఈవారం ఇద్దరు మహాకవుల కథలు....వినిపిస్తున్నాను. ఒకరు గురజాడ....మరొకరు శ్రీ శ్రీ.....* ఇద్దరూ మహాకవులే ! శ్రీ శ్రీ గారు గురజాడకు వీరాభిమాని. "అడుగుజాడ గురజాడది... అది భావికి బాట....మనలో వెధవాయత్వం మరపించే పాట " అంటారు. *మొదటి కథ గురజాడ వారి దిద్దుబాటు* తొలి నాటి తెలుగు కథల్లో ఒకటి. సన్నివేశ ప్రధానమైన కథ.కథలోని నాయకుడు వేశ్యా వాటికకు ఆట పాటలు చూడడానికి వెళ్లిన ఒక సదయ సహృదయుడు. తప్పు చేసినా దిద్దుబాటు చేసుకోగల జ్ఞానం ఉన్న మనిషి .సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ...అనీ...బెటర్ హాఫ్ అంటే....పెళ్లాము మొగునికన్న దొడ్డది అనే గ్రహింపు కలిగిన వ్యక్తి. చెడు అలవాట్లు చేసుకుని భార్యను బాధించకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి.అందువల్ల కథ సుఖాంతము అయ్యింది. *రెండవ కథ శ్రీ శ్రీ గారి....అశ్వమేథయాగం.* వ్యసనాలకు బానిస అయిన వ్యక్తి తల్లి మరణ శయ్యపై ఉన్నదన్న వార్తను తెచ్చిన టెలిగ్రామ్ అడ్డుపెట్టుకుని....అప్పు పుట్టించుకుని ... గుర్రపు పందేలు ఆడి.... వ్యక్తి పతనానికి వ్యసనం ఏ విధంగా దారితీస్తుందో... వ్యధా భరితంగా చెప్పిన కథ. శ్రీ శ్రీ గారి కవితల్లో కనిపించే పతితుడు... భ్రష్ఠుడు...కథలోని వెంకటరావు. రెండుకథల్లోని హీరోల ఆలోచనా ధోరణుల్ని గమనిస్తే...మంచి-చెడు అనేవి మనస్సుని అదుపులో పెట్టుకోడం ద్వారా సాధించవచ్చు అని బోధిస్తాయి. వినండి ఇద్దరు మహా కవుల కథలు. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Ph 96770
-
65
యూ టర్న్....రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్
💐💐 *కృష్ణాతీరం విజయవాడ నుండి...కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ....యూ టర్న్....రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్* రచయిత అనే వ్యక్తి తనలోని సీరియస్ ఆలోచనల్ని తన రాతల్లోకి అనువదించగలిగితే.... ఆ రచన నిశ్చయంగా గొప్పగా ఉంటుంది. శ్రీ పద్మాకర్ అటువంటి సీరియస్ రచయిత.గొప్పరచయిత. రచనని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించిన రచయిత . యూ టర్న్ కథలో ఒక చిన్న పాప అమాయకంగా తను కూడబెట్టుకున్న తన సంపద "బలపాలను " ఒక కోటీశ్వరుడి ముందు కానుకగా ప్రేమతో కుమ్మరించినప్పుడు ఆ మల్టీ బిలియనేర్ తెలుసుకున్న సత్యం ఏమిటి ? "డబ్బుచేసి" బాధపడుతున్న అతడి మనసుకి స్వస్థత ఎలా చేకూరింది అని గొప్ప రీతిలో ఆలోచనా ధారలు కురిపిస్తూ చెప్పిన కథ "యూ టర్న్ " .ఈ కథ మీకు వినిపించడానికి అనుమతి ఇచ్చిన రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్ గారికి (ఫోన్ 95813 97500 ) ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినండి *ఈ వారం కథ దగ్గుమాటి పద్మాకర్ గారి "యూ టర్న్ "* 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst. General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158 Mail kopparthykathavahini@gmail. com.
-
64
"వెండి కంచం " . రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "వెండి కంచం " . రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు.పాతరోజుల కథ. కథాకాలం ఇదమిద్దం గా తెలియదు.స్వాతంత్రం వచ్చిన తొలిరోజులుకావచ్చు. మునిమాణిక్యం వారు అనగానే గుర్తొచ్చే పాత్ర "కాంతం" . మధ్యతరగతి ఇల్లాలికి సజీవ రూపం. సంసారం నడుపుకోడానికి అవసరమైన ఒద్దికతనమూ... గడుసుదనం కలగలసిన ఆదర్శఇల్లాలు.భర్త మనసెరిగి మసలుకునే ఇల్లాలు కూడా ! తెలుగులో కాంతం కథలు , భానుమతిగారి అత్తగారి కథలు , అమరావతి కథలు , ఎగువ...దిగువ గోదావరి కథలు ఇలా వివిధ నేపధ్యాలలో రాసిన కథలు రచయితలు ఉన్నారు. మునిమాణిక్యం వారు కాంతం పాత్రను సజీవ పాత్రగా రూపుదిద్దారు. మధ్యతరగతి వారి ఆదాయ వ్యయాలు...ఆశలు , కోరికలు ఎంతో హృద్యంగా సున్నితమైన హాస్యంతో మేళవించి రాసిన కథ "వెండి కంచం " . కథలో మనసుకి తాకే అంశం భర్తకోరిక తీర్చడంలో ఆ ఇల్లాలు భర్త పట్ల అనురాగంతో అనుసరించిన ఆర్థిక క్రమశిక్షణ.పొదుపరితనం. ఆదాయానికి తగ్గట్టుగా....ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుకురావడంలో ఇల్లాలి పాత్ర నాటికి...ఈనాటికి...ఏనాటికి... తిరుగులేనిది అనే జీవన సత్యం విశదం చేసే కథ. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో స్త్రీలు ఎప్పుడూ మగవారికన్నా మెరుగైన వారు అని అంగీకరించక తప్పని సత్యం. భర్త కోరిక తీరేలా వెండి కంచం కొని అందులో కడుపారా భోజనం పెట్టి....ఆ పై ఆ కంచంలోనే ఆకు, వక్కలు అందించిన ఆ ఇల్లాలు దాంపత్యంలోని మాధుర్యాన్ని భర్తకి పంచిన తీరు ప్రశంసనీయం.వినండి ఈ వారం కథ "వెండి కంచం " రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు. 💐💐మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Phone 96770 15158 Mail [email protected].
-
63
"పూర్ణమూ....నిరంతరమూ..." రచయిత కె ఏ ముని సురేష్ పిళ్లే
💐💐 కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏యధాప్రకారం మూడో వారం ఎవరి ఇళ్ళవద్ద వారు క్షేమంగా కాలం గడుపుతున్నట్లు తలుస్తాను. *ఈవారం మనం వినబోయే కథ "పూర్ణమూ....నిరంతరమూ..." రచయిత కె ఏ ముని సురేష్ పిళ్లే* శ్రీకాళహస్తికి చెందిన ముని సురేష్ గారు పాత్రికేయుడు , రచయిత. ఆయన రాసిన ఈ కథ తండ్రీకొడుకుల మధ్య ఉండే ఒక స్నేహాభావాన్ని చక్కగా చిత్రీకరించిన కథ. అంతే కాదు మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోజాలని మృత్యువు గురించి , అది తెచ్చే దుఃఖము , వెళ్లిపోయిన వాళ్ళు మిగిల్చే జ్ఞాపకాలను గురించి ఏ విధంగా ఆలోచించాలి అని అంగీకరించక, అనుసరించక తప్పని తాత్విక ఆలోచనా దారుల్ని మనకు చూపిస్తుంది....శ్రద్దగా విని మనసుకి పట్టించుకోవాల్సిన వాక్యాలు ఈ కథలో నాలుగైదు చోట్ల తగులుతాయి. అవి మనల్ని మన మనసులోతుల్లోకి వెళ్లి ఆలోచించుకునేల చేస్తాయి. ఈ మధ్య ప్రతివారం నేను కథ వెతుక్కునే శ్రమ లేకుండా...మిత్రులు సహాయపడుతున్నారు. ఈ కథ నాకు సూచించి.....నేను తప్పక చదివి వినిపించదగ్గ కథ అని నన్ను ప్రోత్సహించిన మా తమ్ముడు చిరంజీవి పతంజలికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినండి...సురేష్ పిళ్ళై గారి కథ "పూర్ణమూ....నిరంతరమూ " 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail rambabuk. indianbankwms@ gmail. com
-
62
"నరసన్న పాపాయి " రచయిత ....కీ.శే.అడవి బాపిరాజు గారు
💐💐 కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం కూడా అందరూ స్వహితం , లోకహితం కోసం ఇళ్లకు పరిమితం అయి క్షేమంగా ఉంటున్నారు అని భావిస్తాను. ఈ వారం మనం వినబోయే కథ "నరసన్న పాపాయి " రచయిత ....కీ.శే.అడవి బాపిరాజు గారు. బాపిరాజు గారు కవి , రచయిత , చిత్రకారుడు.... కళాతపస్వి. ఈ కథ ఎంచుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు . ఒకటి ఇది బాపిరాజు గారి వంటి సుప్రసిద్ధ సాహితీవేత్త రచయిత రచన కావడం. బాపిరాజు గారు ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు (యూనివర్సిటీ ) నిర్వహించిన నవలల పోటీలో వారి "నారాయణ రావు " నవల ద్వారా.....విశ్వనాథ సత్యనారాయణ గారి " వేయిపడగలు " నవలతో పోటీ పడి బహుమతి పంచుకున్న గొప్ప రచయిత. విశ్వనాథ వారు....మా బాపి బావతో కాబట్టి బహుమతి పంచుకోడానికి ఒప్పుకుంటున్నాను అని ప్రకటించారు అంటే అప్పటి సమకాలీన రచయితల్లో ఆయనకు ఉన్న విలువ , గౌరవం ఎటువంటిదో తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో కారణం ఈ కథా రచన స్వాతంత్ర్యానికి పూర్వం 1946 లో జరిగింది. ఈ కథాకాలానికి ఇప్పటికీ సమాజం పూర్తిగా మారింది. రచయితలు తమ రచనల్లో సమకాలీన సమస్యలకు స్థానం కల్పిస్తూ , వారున్నప్పటి వర్తమాన సమాజ స్థితిగతులను ప్రతి బింబిస్తూ రచనలు చేస్తారని.... అంతే కాక సమాజంలో మంచి మార్పు రావాలి అని కోరుకుంటారనీ ఈ కథ మనకు తెలియచేస్తుంది.వినండి ఈవారం కథ "నరసన్న పాపాయి "అడవి బాపిరాజు గారి రచన. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు, Retd AGM Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail kopparthykathavahini@gmail. com
-
61
కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం "జానకితో జనాంతికం "
కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం "జానకితో జనాంతికం " కి బాపుగారు వేసిన చిత్రం ఇది. సర్వం తానే అయి వుండి వ్యాపించి ఉన్న స్వామి పాదాల వద్ద అమ్మవారు కూచుని అంతటా ఉన్న ఆయన వద్ద జనాంతికం ఎలా అన్నట్టు చిన్న నవ్వు నవ్వుతున్న ఈ బొమ్మ బాపూ గారికి ఎంతో ఇష్టం. భద్రాచలం లో శ్రీరామ నవమి రోజు సీతారామ కల్యాణానికి ఆల్ ఇండియా రేడియో లో శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు...జమ్మలమడక మాధవరామ శర్మ గారు శ్రీ ఉషశ్రీ గారు వినిపించే ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆ కమనీయ కల్యాణాన్ని అందరి కళ్లముందూ రమణీయంగా నిలిపేది. నా చిన్నతనంలో విన్న ఆ జ్ఞాపకాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ....మీ అందరికోసం ఈ వాక్ చిత్రాన్ని వినిపించడానికి సహృదయంతో అనుమతించిన వెంకటరమణ శాస్త్రిగారి కుటుంబసభ్యులు శ్రీమతి ధూళిపాళ అన్నపూర్ణ , మహాదేవమణి దంపతులకు కృతజ్ఞతలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో.....🙏మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada Phone 96770 15158.
-
60
"తరగతి గదిలో తల్లి " రచయిత శ్రీ సింగమనేని నారాయణ
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏. అందరూ ఇళ్లకు పరిమితమయ్యి క్షేమంగా ఉన్నారని భావిస్తాను. ఈ వారం మనం వినబోయే కథ "తరగతి గదిలో తల్లి " రచయిత శ్రీ సింగమనేని నారాయణ. ఈ కథ నాకు జనవరి నెలలో జరిగిన విజయవాడ పుస్తక మహోత్సవంలో ఒక సాహిత్యాభిమాని చిన్న booklet గా వేసి పంచిపెడుతుండగా....నా చేతికి వచ్చింది. ఆయన పేరు శ్రీ దేవినేని మధుసూదన్ రావు గారు. వృత్తిరీత్యా ఆడిటర్. విజయవాడ సమీపంలోని తెన్నేరు గ్రామంలో దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.... మంచి సాహిత్యాన్ని , పిల్లలకు ఉపయోగ పడే పుస్తకాలను ప్రచురించి ఉచితంగా స్కూల్స్ కి అందచేస్తుంటారు. నేను కథలు చదివి వినిపించే క్రమంలో పిల్లలకు ఉపయోగపడే కథలు అందించవలసిందిగా కొందరు మిత్రులు అడిగారు.అయితే ఆ పని నేను ఇప్పటిదాకా చెయ్యలేకపోయాను. ఈ కథ పెద్దవాళ్ళు పిల్లలకు వినిపోయిస్తే వారికి కూడా నచ్చుతుంది అనిపించింది. కథా రచయిత సింగమనేని నారాయణ గారు విశ్రాంత ఉపాధ్యాయులు. ప్రముఖ రచయిత. అనంతపురంలో ఉంటారు.విశాలాంధ్ర సంపాదక వర్గ సభ్యులు. పిల్లలకు పాఠాలు నేర్పే గురువులు మంచి విషయాలు ఎలా నేర్పించాలో ఈ కథ చక్కగా చెప్తుంది. వినండి సింగమనేని నారాయణగారి కథ "తరగతి గదిలో తల్లి " కథ.🙏మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank విజయవాడ . Mail rambabuk. [email protected] phone 96770 15158.
-
59
"పరిష్వంగం" . రచన శ్రీ పి. రామకృష్ణ.
కృష్ణాతీరం విజయవాడ నుండి....కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "పరిష్వంగం" . రచన శ్రీ పి. రామకృష్ణ. ఈ కథలోనూ...ఈ కథ నేను మీకు చదివి వినిపించడంలోనూ ఒక మంచి విషయం ఉంది. నేను తెలుగు కథలు చదివి వినిపించడం మొదలుపెట్టినప్పటి నుంచి నా వద్దనున్న వివిధ కథానికా సంకలనాల్లోంచి ఎంచుకుని కథలు వినిపిస్తున్నాను. అయితే రెండు రోజుల క్రితం విజయవాడ మా ఇంటికి నా చిరకాల ఆత్మీయ మిత్రులు శ్రీ వంగల హర్షవర్ధన్ వచ్చారు.ఆయన వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ కమిషనర్ గా ఈ మధ్యే పదవీ విరమణ చేశారు. మంచి సాహిత్యాభిలాషి. రచయిత కూడా ! ఆయన రచనలు ఒక రెండు పుస్తకాలతో పాటు , వారి తండ్రిగారు కీ. శే. వంగల శ్రీరామమూర్తి గారికి నివాళిగా "తండ్రీ ! నిన్నుదలంచి..." అని ప్రచురించిన ఒక చిన్న పుస్తకం ఇచ్చారు. యాభై పేజీలకు మించని ఆ పుస్తకంలో వారి కుటుంబసభ్యులు ఏడెనిమిది మంది కీ. శే.శ్రీరామమూర్తి గారి గురించి ,వారి జ్ఞాపకాలు క్లుప్తంగా పంచుకున్నారు.ఆ జ్ఞాపకాలతో పాటు ఆ చిన్న పుస్తకంలో వారికి నివాళి అర్పించడానికి సందర్భానికి సరిపోయేవిధంగా ఉన్న ఒకటి రెండు కథలు , కవితలు , వ్యాసాలు చేర్చారు.అనుకోకుండా ఆ నివాళి పుస్తకంలోని ఒక కథ నన్ను ఆకర్షించింది. ఆ కథే "పరిష్వంగం " . నన్నయ భారతంలో దుష్యంతోపాఖ్యానంలో తండ్రీ కొడుకుల బాంధవ్యాన్ని గురించి శకుంతల చెప్పిన ఒక పద్యం మనసులో నిలుపుకున్న ఒక తండ్రికి , తన కుమారుని పట్ల గల ప్రేమని , ఇష్టాన్ని వెలికితీసిన ఈ కథ తండ్రి కొడుకుల బాంధవ్యానికి ఎనలేని విలువను చేకూర్చే కథ.వినండి శ్రీ పి.రామకృష్ణ గారి కథ "పరిష్వంగం ".💐💐మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158. Mail rambabuk. indianbankwms@gmail. com
-
58
"గోధూళి వేళ " , రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ సందర్భంగా , ఈ వారం మనం వినబోయే కథ "గోధూళి వేళ " , రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి. సత్యవతి గారు ప్రముఖ రచయిత్రి. స్త్రీల సమస్యలను ఎంతో స్పష్టంగా అర్థం చేసుకుని , రచనలు చేస్తారు. ఆమె కథ చెప్పే తీరులో గొప్ప శిల్ప చాతుర్యం ఉంటుంది. సాదాసీదా శైలిలో కథలు రాసే ఆమె , ఎంతో స్పష్టమైన భావాలను వ్యక్తం చేస్తారు. గోధూళి వేళ కథలో రచయిత్రి ఒక చోట , ఉదయం నించి రాత్రి దాకా రోజు మొత్తంలో ఎన్ని వేళలు ఉంటాయో సరదాగా రాసుకొచ్చారు. గోధూళి వేళను ఆవులు ఇంటికి చేరే వేళ అని మాత్రమే కాకుండా....స్త్రీలకు ప్రతీకాత్మకంగా మార్చి....ఉద్యోగస్తులు అయిన స్త్రీలు ....సాయంవేళ చీకటి పడేసరికి ఇల్లు చేరుకోవాలి అని కోరుకుంటారు....ఎందుకంటే వారికోసం ఇంటివద్ద లేగ దూడల వంటి చిన్న పిల్లలు ఎదురుచూస్తుంటారు , సంసారబాధ్యతలు ఎదురుచూస్తుంటాయి అని చెప్పి కథను ముగించడం , వివిధ రంగాలలోని స్త్రీలు వేళకు ఇల్లు చేరడంలో సమాజం ఎంతగా ప్రాముఖ్యత చూపుతుందో వివరించడం ద్వారా , స్త్రీ వాదిగా సమస్యను మనముందు ఉంచిన తీరు ఆమె స్త్రీల సమస్యను ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటారో తెలుసుకోవచ్చు. ఒక విశేషం ఏమిటి అంటే....ఈ రోజే ఆమెను వారి ఇంట్లో కలుసుకుని ఆమె రాసిన కథను ఆమెకు వినిపించాను.అది నా అదృష్టం. వినండి శ్రీమతి పి సత్యవతి గారి కథ " గోధూళి వేళ " 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada phone 96770 15158 Mail rambabuk. indianbank wms @gmail. com
-
57
చా. సో గా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు గారి రచన "ఎందుకు పారేస్తాను నాన్నా "
💐💐 కృష్ణా తీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.🙏 ఈవారం మనం వినబోయే కథ చా. సో గా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు గారి రచన "ఎందుకు పారేస్తాను నాన్నా ". ఉత్తరాంధ్ర రచయితల్లో అగ్రశ్రేణి రచయిత , అభ్యుదయ తెలుగుసాహిత్యానికి ప్రతినిధి అనదగ్గ కొద్దిమంది రచయితల్లో కీ.శే శ్రీ చా సో ఒకరు. గురజాడ, శ్రీ శ్రీ , ఆరుద్ర , రొణంంకి , రావి శాస్త్రి , కాళీపట్నం రామారావు గారు వంటి సాహితీ మూర్తులు జన్మించిన ఉత్తరాంధ్ర తీరపు, గొప్ప రచయిత స్వర్గీయ శ్రీ చా. సో. తెలుగులో మేలిమి ముత్యాలవంటి కథలు రాశారు. వారి కుమార్తె శ్రీమతి చాగంటి తులసి , కుమారుడు శంకర్ కూడా రచయితలు.ప్రస్తుత కథలోకి వస్తే....ఆర్థికంగా బలం లేని కుటుంబాలలో ప్రతిభ , తెలివితేటలు ఉండి కూడా చదువుకు నోచుకోలేని వారి సంఖ్య గతంలో ఎక్కువగా ఉండేది. అటువంటి ఒక పిల్లవాడి మనో వేదన మనకు వేదన కలిగే రీతిలో రాసిన కథ "ఎందుకు పారేస్తాను నాన్నా !" ప్రస్తుతం ప్రభుత్వాలు విద్యను అన్ని వర్గాల వారికీ అందుబాటులోకి తేవాలి అని, చదువుకోవడం ప్రాధమిక హక్కు అనే ఆలోచనతో చేపట్టిన అనేక పథకాలు కొంతవరకూ సత్ ఫలితాలను ఇస్తున్నాయి. గురుకుల పాఠశాలలు , నవోదయ విద్యాలయాలు , స్కాలర్షిప్పులు , ఫీజు రీయింబర్సుమెంట్ లు , విద్యారుణాలు చదువుకునే అవకాశాలను ఇతోధికంగా పెంచాయి. ఎంతో కొంత సత్ఫలితాలను ఇచ్చాయి. ఇస్తున్నాయి. ఒక బ్యాంక్ ఉద్యోగిగా ఉన్నత విద్యకు ఎంతో మందికి విద్యారుణాలను మంజూరు చేసే అదృష్టం నా మాతృసంస్థ ఇండియన్ బాంక్ ద్వారా ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం. ఈ కథ నా మనసులో చాలా రోజులనించి ఉన్నది. చాసో గారి , వాయులీనం , బొండు మల్లెలు కూడా గొప్ప కథలు.ఈ కథ 7 వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా ఉన్నది అని విన్నాను. వాడ్రేవు సుందరరావు గారు షార్ట్ ఫిల్మ్ గా కూడా తీశారు. యు ట్యూబ్ లో చూడవచ్చు.గత నెల 17 వ తేదీ చా సో గారి జన్మదినం. వారిని స్మరించుకుంటూ..వినండి చా సో గారి కథ "ఎందుకు పారేస్తాను నాన్నా ! " 🙏 మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada Ph 96770 15158 Mail rambabuk. indianbankwms@gmail. com.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
Loading similar podcasts...